కమ్యూనిస్ట్ పార్టీలు మారుతున్నాయన్నారు సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు మేం దగ్గరవుతాం. సీఎం కేసీఆర్ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడి వుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకు వస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని తట్టుకుని నిలబడుతున్నాం. ఓట్లు ఎరవేసి అధికారం సాధిస్తున్నారన్నారు బీవీ రాఘవులు.
లౌకిక వాదానికి బీజేపీ ప్రమాదకరం. రైతు ఉద్యమం ఎన్నో మార్పులు తెచ్చింది. పార్లమెంటరీ రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. రాబోయే రోజుల్లో మేం పుంజుకుంటాం. గతంలో దుష్ర్పచారాలు చేసి కమ్యూనిస్టు పార్టీలను అణచివేయాలని చూశారు. కానీ ఇప్పుడు మీడియా విస్తారంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. మేం చేసిన తప్పులు జనానికి చెబితే మా విలువ పెరుగుతుంది. మా లోపం గురించి మేం తెలుసుకుంటాం. అందరికీ చెబుతాం. కమ్యూనిస్టులకు ప్రజలు దూరం అవుతున్నారన్నది తెలుసుకుంటున్నాం.
మా ఆలోచనను మార్చుకుని ముందుకు సాగుతున్నాం. పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి మాకింకా అలవడలేదు. బస్తీ నుంచి ఢిల్లీ వరకూ డబ్బుల ప్రభావం పెరిగింది. పార్టీలు విరాళాలు భారీగా సేకరిస్తున్నాయి. ఎలక్షన్ బాండ్లకు మేం వ్యతిరేకం. మార్పు వస్తోందని, ఆ బీజాలు కనిపిస్తున్నాయి. బలహీనతల్ని మేం అధిగమిస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. మళ్ళీ బలపడుతున్నాం అన్నారు రాఘవులు.