CPM Resolution: విభజన హామీలపై సీపీఎం తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.
మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
చారిత్రక ప్రదేశాలను కమ్యూనిస్టులు ఎప్పుడూ సందర్శిస్తారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్ బాబాకు లేదు. సమానత్వం ఎక్కడ ఉందో రామ్ దేవ్ బాబా చెప్పాలి. రాందేవ్ బాబా దళిత వాడలు,గిరిజన వాడలను సందర్శించిన తరువాత సమానత్వం గురించి మాట్లాడాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని మండిపడ్డారు.
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
కేసీఆర్ విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని చెప్పడం సంతోషంగా వుందన్నారు. కేంద్రం 35వేల కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీని తగ్గించింది. బీజేపీని ఓడించేందుకే ప్రజల మద్దతు అవసరం వుందన్నారు. విభజన హామీలపై త్రిసభ్య కమిటీ వేయడానికి నరేంద్రమోదీకి ఏడేళ్లు పట్టింది. ఈ కమిటీ కంటి తుడుపు చర్యే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి శృంగ భంగం కలుగుతుంది. కర్ణాటకలో హిజాబ్ పేరుతో.. మత వివాదాన్ని సృష్టించింది.
యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ హిజాబ్ సమస్య ను తీసుకువచ్చిందని రాఘవులు విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో విభజన హామీలపై తీర్మానం చేసామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెతక వైఖరి అవలంభించారు. కేసీఆర్ కేకలు వేస్తున్నారు తప్పితే బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో చెప్పి మాట తప్పారన్నారు.
అమాయక గిరిజనుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. శాటిలైట్ ఫిక్చర్ ల ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మత సమస్య పేరుతో బీజేపీ ఆందోళనలు సృష్టిస్తుందన్నారు. తెలంగాణను అవమానించే అర్హత మోదీకి లేదు. టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకునే అర్హత బీజేపీ కి లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రాష్ట్రాల హక్కులను కేంద్రం హారిస్తోందని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
-
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?