CPM Resolution: విభజన హామీలపై సీపీఎం తీర్మానం
విభజన హామీల అమలును కేంద్రం విస్మరించిందని, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు మెతక వైఖరి అనుసరించారని సీపీఎం అభిప్రాయపడింది. సీపీఎం రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ఆవిష్కరించారు బీవీ.రాఘవులు. ఏప్రిల్ 6 నుంచి కేరళ రాష్ట్రం కన్నూరులో సిపిఎం జాతీయ మహా సభలు జరుగుతాయి.
మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానానికి తుది రూపు వస్తుంది. వామపక్ష నేతలు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలని రాందేవ్ బాబా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యోగా గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
చారిత్రక ప్రదేశాలను కమ్యూనిస్టులు ఎప్పుడూ సందర్శిస్తారు. సమానత్వం గురించి మాట్లాడే హక్కు రాందేవ్ బాబాకు లేదు. సమానత్వం ఎక్కడ ఉందో రామ్ దేవ్ బాబా చెప్పాలి. రాందేవ్ బాబా దళిత వాడలు,గిరిజన వాడలను సందర్శించిన తరువాత సమానత్వం గురించి మాట్లాడాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని మండిపడ్డారు.
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
కేసీఆర్ విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని చెప్పడం సంతోషంగా వుందన్నారు. కేంద్రం 35వేల కోట్ల రూపాయల ఫర్టిలైజర్ సబ్సిడీని తగ్గించింది. బీజేపీని ఓడించేందుకే ప్రజల మద్దతు అవసరం వుందన్నారు. విభజన హామీలపై త్రిసభ్య కమిటీ వేయడానికి నరేంద్రమోదీకి ఏడేళ్లు పట్టింది. ఈ కమిటీ కంటి తుడుపు చర్యే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి శృంగ భంగం కలుగుతుంది. కర్ణాటకలో హిజాబ్ పేరుతో.. మత వివాదాన్ని సృష్టించింది.
యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ హిజాబ్ సమస్య ను తీసుకువచ్చిందని రాఘవులు విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో విభజన హామీలపై తీర్మానం చేసామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెతక వైఖరి అవలంభించారు. కేసీఆర్ కేకలు వేస్తున్నారు తప్పితే బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో చెప్పి మాట తప్పారన్నారు.
అమాయక గిరిజనుల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. శాటిలైట్ ఫిక్చర్ ల ద్వారా మోసం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మత సమస్య పేరుతో బీజేపీ ఆందోళనలు సృష్టిస్తుందన్నారు. తెలంగాణను అవమానించే అర్హత మోదీకి లేదు. టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకునే అర్హత బీజేపీ కి లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రాష్ట్రాల హక్కులను కేంద్రం హారిస్తోందని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!