నిత్యం వార్తల్లో వుండే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. కర్నూలులో హనుమంతరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధాని మోడీ పని పాట లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఏమి చేశారో చెప్పకుండా రాష్ట్ర విభజనపై మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు వి హనుమంతరావు.
ప్రధాని మోడీ లేని పంచాయతీలు పెడుతున్నారన్నారు. స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు కావాలన్నవాళ్ళు ఇచ్చారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో సుష్మా స్వరాజ్ కూడా వున్నారు. ఆమె ఏం చేశారు. రేప్ చేసిన వాళ్ళకంటే అడ్డుకోకుండా చూసిన వాళ్లదే ఎక్కువ నేరం అవుతుందన్నారు. కేసీఆర్ కు మోడీకి మంచి సంబంధాలు ఉండేవి… ఎక్కడి చెడిందో అని అనుమానాలు వ్యక్తం అయ్యాయన్నారు. మోడీ, కేసీఆర్ కొట్లాట డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ను తలపిస్తుందని వీహెచ్ ఎద్దేవా చేశారు.