కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెల్సిందే.. సిద్ధిపేట పట్టణంలోని పలువార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. నిన్న ఒక్క రోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు వైద్యాధికారులు. హోమ్…
హైదరాబాద్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. చార్మినార్, గోల్కొండ, జంట జగరాలను కలపే హుస్సేన్సాగర్ అందాలు కనువిందు చేస్తాయి.. ఇక, శివారు ప్రాంతాల్లోనే మరికొన్ని స్పాట్లు కూడా ఆకట్టుకుంటాయి.. త్వరలో హైదరాబాదీలు, పర్యాటకులకు అసలైన థ్రిల్ అందించేందుకు సర్కార్ సిద్ధం అవుతోంది.. రష్యా రాజధాని మాస్కోలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఫ్లోటింగ్ బ్రిడ్జిను పోలిన బ్రిడ్జి.. ఇప్పుడు మన హైదరాబాద్లో రాబోతోంది.. పీవీఎన్ఆర్ మార్గ్లో అంటే నెక్లెస్ రోడ్డులో హుస్సేన్ సాగర్ మీద ఈ ఏడాది చివరికల్లా ఆ…
పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో (రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) సాంకేతిక కారణాలుతో పాటు పలువురు సిబ్బందికి కరోనా సోకడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని యాజమాన్యం నిలిపి వేసింది. ఆర్ఎఫ్సీఎల్లోని ప్రిల్లింగ్టవర్లో ఏర్పడ్డ సాంకేతిక అంశాలతోపాటు పలువురు శాశ్వత ఏర్పడ్డ ,ఒప్పంద ఉద్యోగులుకు కరోనా రావడంతో కర్మాగారంలో ఉత్పత్తి పనులను నిలిపివేసినట్టు యాజమాన్యం ప్రకటించింది. Read Also: తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు…
రాష్ట్ర వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వేయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తుంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జగిత్యాల అదనపు కలెక్టర్గా బీఎస్ లత, నారాయణ్పేట్ అదనపు కలెక్టర్గా జి.పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్గా ఖీమానాయక్కు పోస్టింగ్లను రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. అలాగే వరంగల్ అదనపు కలెక్టర్గా కె…
తమిళనాడు కరోనాతో వణికిపోతోంది. తమిళనాడులో కరోనా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 23) నాడు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. లాక్ డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులకు వెళ్లే ట్యాక్సీలు, ఆటోలకు మినహాయింపు ఇచ్చారు. గురువారం ఒక్కరోజే తమిళనాడులో 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వీరవిహారం…
తెలంగాణ కాంగ్రెస్లో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలను తప్ప.. ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు. దీన్నే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఈ వైఖరే ఇటీవల పెద్ద తలనొప్పికి దారి తీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొదలుకుని.. క్రమశిక్షణ కమిటీ వరకు… రచ్చ రచ్చ అయింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాజీనామాల వరకు వెళ్లిందా వ్యవహారం. ఈ అంశంపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. మాజీ మంత్రి జానారెడ్డి లాంటి…
హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో ఓ రేంజ్లో రాజకీయ వేడి రాజేసింది. అక్కడ ఫలితం వచ్చాక చర్చ అటువైపు వెళ్లలేదు. ఓటమిని లైట్ తీసుకున్నట్టుగా టీఆర్ఎస్ కనిపించింది. అయితే హుజురాబాద్ రాజకీయ క్షేత్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. ఉపఎన్నికలో గుర్తించిన పొరపాట్లు రిపీట్ కాకుండా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు ఉపఎన్నికలో ఓడిన గెల్లు శ్రీనివాస్ కాగా.. రెండో వ్యక్తి హుజురాబాద్…
రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్ఎస్ ప్రమాదకరమన్నారు.బీజేపీ…టీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు. Read Also: సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో…
ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మిర్చిరైతుల సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా…
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి... దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా…