Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు. వీరి కుమారుడు జంపన్న ఆత్మాభిమానంతో సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో సమ్మక్క ఆదిపరాశక్తి గా మారి వీరోచిత పోరాటం చేస్తుంది. అయితే కాకతీయ సైన్యం దొంగచాటుగా దెబ్బతీయడంతో సమ్మక్క చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యం అవుతుంది.
Read: TATA Group: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్న్యూస్…విమానం రద్దయితే…
Also Read
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
సమ్మక్క అదృష్యమైన చిలుకల గుట్ట ప్రాంతంలోని నాగవృక్షం దగ్గర ఓ కుంకుమ భరిణ లభించింది. దానినే సమ్మక్కగా భావించి మాఘపూర్ణిమ రోజున పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో ప్రధాన ఘట్టం చిలుకల గుట్టలో ఉన్న కుంకుమ భరిణని తీసుకురావడమే. ప్రధాన పూజారి చిలుకల గుట్టకు ఒంటరిగా వెళ్లి భరిణను తీసుకొని కిందకి వస్తాడు. పూజారి రాకను గమనించిన తరువాత పోలీసులు గౌరవ వందనంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. సారక్క వనదేవత వస్తుందని గుర్తించిన భక్తులు పరవశించిపోతారు. మేళతాళాలు మిన్నంటుతాయి. ఈ భరిణను గద్దెల వద్ద ఉంచుతారు. నాలుగోరోజు పూజలు నిర్వహించిన అనంతరం వనదేవతలను తిరిగి అక్కడి నుంచి తరలించడంతో జాతర ముగుస్తుంది. తొలిరోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలౌతుంది. సమ్మక్క ఆహ్వానంతో రెండో రోజు జాతర జరుగుతుంది. ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువైన తరువాత మూడో రోజు జాతర అంగరంగ వైభవంగా జరుగుతంది. అమ్మల వనప్రవేశంతో నాలుగో రోజు జాతర ముగుస్తుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!