Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు. వీరి కుమారుడు జంపన్న ఆత్మాభిమానంతో సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో సమ్మక్క ఆదిపరాశక్తి గా మారి వీరోచిత పోరాటం చేస్తుంది. అయితే కాకతీయ సైన్యం దొంగచాటుగా దెబ్బతీయడంతో సమ్మక్క చిలుకల గుట్టవైపు వెళ్లి అదృశ్యం అవుతుంది.
Read: TATA Group: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్న్యూస్…విమానం రద్దయితే…
Also Read
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
సమ్మక్క అదృష్యమైన చిలుకల గుట్ట ప్రాంతంలోని నాగవృక్షం దగ్గర ఓ కుంకుమ భరిణ లభించింది. దానినే సమ్మక్కగా భావించి మాఘపూర్ణిమ రోజున పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో ప్రధాన ఘట్టం చిలుకల గుట్టలో ఉన్న కుంకుమ భరిణని తీసుకురావడమే. ప్రధాన పూజారి చిలుకల గుట్టకు ఒంటరిగా వెళ్లి భరిణను తీసుకొని కిందకి వస్తాడు. పూజారి రాకను గమనించిన తరువాత పోలీసులు గౌరవ వందనంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. సారక్క వనదేవత వస్తుందని గుర్తించిన భక్తులు పరవశించిపోతారు. మేళతాళాలు మిన్నంటుతాయి. ఈ భరిణను గద్దెల వద్ద ఉంచుతారు. నాలుగోరోజు పూజలు నిర్వహించిన అనంతరం వనదేవతలను తిరిగి అక్కడి నుంచి తరలించడంతో జాతర ముగుస్తుంది. తొలిరోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు లను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలౌతుంది. సమ్మక్క ఆహ్వానంతో రెండో రోజు జాతర జరుగుతుంది. ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువైన తరువాత మూడో రోజు జాతర అంగరంగ వైభవంగా జరుగుతంది. అమ్మల వనప్రవేశంతో నాలుగో రోజు జాతర ముగుస్తుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!