కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు.. ఇక, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదని దుయ్యబట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగుల పరస్పర బదిలీలకు (mutual transfers) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది సర్కార్.. ఇక, ఉద్యోగులు మ్యూచువల్ను వెతుక్కోవడానికి నెల రోజుల అవకాశం ఉంటుంది.. దీంతో, ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. ఈడీ…
తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 88,206 శాంపిల్స్ పరీక్షించగా 2,646 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 3,603 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా..…
డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.. ఇప్పటికే కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి.. స్టార్ బాయ్ ఎక్కడివాడు కోణంలో దర్యాప్తు సాగుతోంది.. హైదరాబాద్లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు.. ముంబై, హైదరాబాద్లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్లు టోనీ తీసుకున్నట్టుగా తేల్చారు.. అండర్ గ్రౌండ్లో ఉండి స్టార్ బాయ్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు.. 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నటుగా కూడా పోలీసులు వెలికి…
గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యలో ఎన్నో ఘనతలు సాధించి ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన అనురాగ్ యూనివర్సిటీ తన ఖాతాలో మరో మైలురాయిని నమోదు చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరగబోయే 75 విద్యార్థుల ఉపగ్రహాల మిషన్ (75 Student satilite Mission)లో పాల్గొననుంది. ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ (ITCA)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 2న బుధవారం…
కేంద్ర బడ్జెట్పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన దేనికి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.. దేశానికి ఏం కావాలో అది కేసీఆర్ చెప్పారన్న ఆయన.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు.. ఇక, దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అని మాత్రమే సీఎం కేసీఆర్ అన్నారని.. కేసీఆర్ మాట్లాడిన…
తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మారిపోయింది.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని వదిలి.. ఇప్పుడు మొత్తం బీజేపీపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీజేపీ వైపు తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు.. కేసీఆర్ తెలంగాణ లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడన్న ఆయన.. చూసే వాళ్లకు అందరికి తుపాకీ ఎక్కుపెట్టిన దిక్కే కాల్చుతాడు అనిపిస్తుంది.. కానీ,…
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన కేటాయింపులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దేశంలో షెడ్యూల్ క్యాస్ట్కు చెందినవారు 28 శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.20వేల కోట్లు కేటాయించిందని.. అదే దళిత బంధు కోసం ఒక్క తెలంగాణ ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చుపెడుతోందని కడియం శ్రీహరి వివరించారు. బీజేపీకి చేతనైతే దళిత బంధును దేశమంతా…