Ukraine Students: స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్ధులు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని తమ తమ ప్రాంతాలకు వెళుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు 23 మంది తెలంగాణ విద్యార్థులు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ… ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరారు విద్యార్ధులు. హైదరాబాద్ శంషాబాద్ లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థిని రిసీవ్ చేసుకున్నారు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయి స్కందనను రిసీవ్ చేసుకున్నారు పత్తికొండ తహశీల్ధార్. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా రావడానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపింది స్కందన.
ఉక్రెయిన్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు విద్యార్థులకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానం లో బయలు దేరిన విద్యార్థులు గన్నవరం చేరుకున్నారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో వంశీ (గుంటూరు),అభిషేక్ (తెనాలి) ఫర్జానా (కానూరు), అనూష (కౌతవరం) గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు.
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో స్వగృహానికి చేరారు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధినులు. సుష్మా, సుదర్శనలను రిసీవ్ చేసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉక్రెయిన్ వెస్ట్రన్ లో తాము వున్నామని, అక్కడ యుధ్ధం ప్రభావం అంతగా లేదన్నారు విద్యార్ధినులు. ఈస్ట్రన్ ఉక్రెయిన్ లో యుధ్ధం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మా యునివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగాం. ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉండిపోయారు.
సైరన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని, అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్ధినుల తల్లిదండ్రులు. బెంగళూరు విమానాశ్రయంలో దిగారు చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ఉక్రెయిన్ విద్యార్థులు. వీరిని రిసీవ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. అక్కడి నుంచి సొంత ఊరు చేరుకునేందుకు వాహన సదుపాయం కల్పించారు అధికారులు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
-
SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!