తెలంగాణలో మద్యం కిక్కు బాగా ఎక్కువైంది. ధరలు పెరిగినా మందుబాబుల తీరు మారడం లేదు. ధర ఎంతైనా తాగేస్తాం.. ఊగేస్తాం అన్నట్టుగా వుంది వారి తీరు. మే నెలలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత నెల కన్నా పెరిగిన మద్యం సేల్స్ మందుబాబుల దూకుడుకు సంకేతంగా చెబుతున్నారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు తగ్గుతాయని భావించారు. కానీ అలాంటిదేం లేదని తేలిపోయింది. ఏప్రిల్ నెలలో 27 లక్షల 92వేల721 లిక్కర్ కేసులు…
*ఉదయగిరిలో ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి పర్యటన. *కోవూరులో ఎం.ఎల్.ఏ.నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పర్యటన *ఇవాళ్టి నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతించనున్న టీటీడీ. *శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జనసేన నేత కొణిదెల నాగబాబు. నియోజకవర్గాల సమన్వయ కర్తలు , ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం. *విశాఖలో నేడు, రేపు మాజీ కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఉత్తరాంద్ర టూర్….కేజీహెచ్ లో ఎంపీ నిధులతో కొనుగోలు…
తెరపై ప్రతినాయకునిగా భయపెట్టినా, నిజజీవితంలో ఎంతో సౌమ్యులు, పది మందికి మేలు చేయాలని తపించేవారు డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి. ఆ తపనతోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వస్తున్న సమయంలో సినీకార్మికుల పక్షాన నిలచి ముందు వారికి నివాసస్థలాలు ఇవ్వాలని పట్టు బట్టి మరీ ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో నేడు అతి ఖరీదైన ప్రాంతంగా నెలకొన్న మణికొండలో సినీకార్మికుల గృహసముదాయం వెలసింది. దానికి ‘డాక్టర్ ఎమ్.ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర…
తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా.. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ త్వరగా ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్రిల్ లో గ్రూప్ 1లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు మే 31తో గ్రూప్ 1 అప్లికేషన్…
రేపటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ మేథోమధన సదస్సు, శింతన్ శిబిర్ పేరిట కీసరలో సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగబోతున్న కాంగ్రెస్ సమావేశాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క స్పందించారు. వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా కొందరు అందుబాటులో ఉంటారు.. కొందరు ఉండరని ఆయన అన్నారు. వ్యక్తుల…
తెలంగాణ పంటలపై కీలక కామెంట్లు చేశారు మంత్రి హరీష్ రావు. ఇదే విధంగ మోటర్లకు మీటర్లు పెట్టాలనుకున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 5 ఏళ్లలో అత్యధికి పంటలు పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆకలి చావులు, కాలిపోయే మోటార్లు, గుక్కెడు నీళ్లు లేకుపోయేవని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రైతు బీమా పథకంల దేశంలో ఏ రాష్ట్రం కూడా…
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ కాటమయ్య బోనమెత్తారు. భక్తుల హర్షధ్వానాల మధ్య కాలమయ్య గుడి చుట్టూ తిరిగి దర్శించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహిళలతో కలిసి కాటమయ్యకు బోన మెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు.…
జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం విలేఖరుల సమావేశంలో వెల్లడించిన గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83…
బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి తమిళనాడు వరకు గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే ఐదు…
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కామారెడ్డిలో జలసాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తూ తూప్రాన్ బైపాస్ లో TJS అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడారు. నీళ్లు , నిధులు, నియామకాల్లో టీఆర్స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. ప్రగతి భవన్ లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు. మిగతా వారు ప్రగతి భవన్ కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు నమోదు. ధర్నా చౌక్ లు…