TRS Vs Congress: సీతక్కపై కాంగ్రెస్ ట్వీట్ .. టీఆర్ఎస్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభతో రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా.. సీతక్క తాడును కట్టారు. ఆ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సీతక్కను ఎమ్మెల్యే అనకుండా.. ‘మహిళా రైతు’ అని పేర్కొనడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
‘ఓ మహిళా రైతు రాహుల్ గాంధీ చేతికి కాశీదారం కట్టింది. కాంగ్రెస్ అంటే మార్పును తీసుకొచ్చే ఒక నమ్మకం. తెలంగాణ మార్పును కోరుకుంటోంది.’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆమెకు ఎంతో మంచి పేరుంది. జననేతగా పిలుచుకుంటారు. ఆడంబరాలకు పోకుండా.. సామాన్య మనిషిలా బతుకుతారు. నిత్యం జనాల్లో తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు. అలాంటి సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఎమ్మెల్యే అని కాకుండా.. మహిళా రైతు అని పేర్కొంటారా? ఆమె అభిమానులు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఈ ట్వీట్పై టీఆర్ఎస్ పార్టీ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పించింది. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత క్రిశాంక్ ట్వీట్ చేశారు. ”తప్పుడు ప్రచారం చేయడంలో బీజేకీ కంటే కాంగ్రెస్ ఏమాత్రమూ తక్కువ కాదు. ఆ ఫొటోలో ఉన్న మహిళ.. రైతుకాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.” అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఆ ట్వీట్పైఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అభిమానులేమో.. ఆమెను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీయేమో.. రైతుల పేరుతో రాజకీయాం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఐతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం.. ఇది అడ్మిన్ తప్పిదం వల్ల జరిగిందని.. ఢిల్లీలో ఉండే వారికి సీతక్క గురించి తెలియకపోవచ్చు.. అంత మాత్రానికే.. ఇంత రచ్చ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా షోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేపై అలా ట్విట్ చేయడం సరికాదని అంటున్నారు.
తాజావార్తలు
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!