తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో దశ నేడు పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడా హామీల్ని తుంగలో తొక్కేశాడని…
హైదరాబాద్ సరూర్నగర్లో దారుణ హత్యకు గురైన నాగరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.. వికారాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామంలో.. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది.. నాగరాజును హత్య చేసినవారిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు గ్రామస్తులు.. అంత్యక్రియల తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన నాగరాజు భార్య ఆశ్రీన్.. తాను అన్నవాళ్ల దగ్గరికి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు తనతో సఖ్యతగానే వుంటున్నారని.. పెళ్లి చేసుకున్నా తనను ఒక్క మాట కూడా అనలేదని వెల్లడించింది ఆశ్రీన్. Read…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్లో పర్యటించనున్నారు.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు వరంగల్ పోలీసులు.. 6వ తేదీన రాహుల్ వరంగల్లో పర్యటించనుండగా.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొనబోతున్నారు.. ఈ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. వాటిని ఫాలో కావాల్సిందిగా సూచించారు పోలీసులు. 06న (శుక్రవారం)మధ్యాహ్నం 2 గంటల నుండి హన్మకొండ…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారిపోయింది.. ఇది రాజకీయ దుమారానికి తెరతీసింది.. అదేస్థాయిలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్కు దిగారు.. అయితే, ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతోంది.. పీసీసీ చీఫ్ రేవంత్కు దమ్ముంటే, మొనగాడు అయితే రాహుల్ గాంధీతో డ్రగ్స్ టెస్ట్ కోసం వెంట్రుకలు ఇప్పించాలని… వరంగల్…
శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన విద్యార్థులు ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి ఆకాక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావద్దు అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,393 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. Read Also: Union…
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ ఓయూ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది. రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం నిరాకరించింది.…
తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ.. ఇతర పార్టీల నేతలను.. బీజేపీలోకి ఆహ్వానించే పనిలోపడింది.. ఇప్పటికే చాలా మంది నేతలతో కమలం పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారట.. మరికొందరు.. వారికి టచ్లోకి వస్తున్నారట.. అయితే, పార్టీలో చేరికలు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారు చెప్పే అభ్యంతరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పనిచేయాలని సూచించారు.. దళితుల బస్తీలకు వెళ్లి వాళ్ల సమస్యలు…
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… మహబూబ్నగర్లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మారింది, ఇక, రెండో విడత పాదయాత్ర 5 జిల్లాల మీదుగా 348 కిలోమీటర్లు సాగుతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాలమూరు…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు అధికారులు.. ఇక, రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61,300…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.. అధిష్టానం నుంచి తరచూ రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు నేతలు.. ఇక, ఇవాళ పాలమూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ…