వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన మాట్లాడారో చెప్పాలన్నారు. ఆ డిక్లరేషన్ ఏఐసీసీదా… పీసీసీదా? దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అవలంబిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం అంటూ ఒకటి ఉందా? పూటకో మాదిరిగా ఊరికో మాదిరిగా మాట్లాడతారా? ఏ ఐసీసీ, పీసీసీలు తయారు చేసిన డిక్లరేషన్ కాదు. డిక్లరేషన్ ఇచ్చే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు.
60 సంవత్సరాలుగా తెలంగాణా ప్రజల ఉసురు తీసిందే కాంగ్రెస్. తెలంగాణా ను ఆంధ్రలో కలిపేనాటికి కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో అక్షరం ముక్క అమలుకు నోచుకోలేదు. గిర్ గిలానీ కమిటీ,ఫజల్ అలీ కమిషన్,6 పాయింట్ ఫార్ములా,610 జిఓ లు అమలుకు నోచుకోలేదు. ఆరు దశాబ్దాల కాలంలో ఏ ఒక్కటి అమలు కాలేదు. తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు అయిన చరిత్ర లేదు. వరంగల్ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదు. ఏ ఐ సి సి నాయకుడు వస్తాడు,ఎదో చేస్తాడన్న భ్రమలు తెలంగాణా ప్రజలకు ఏమీ లేవు. 8 ఏండ్లుగా ఈ రాష్ట్ర నాయకులు ఏమి మాట్లాడుతున్నారో తప్ప ఢిల్లీ నుండి కొత్తగా ఢిల్లీ నుండి వచ్చిన మాట ఒక్కటి లేదు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు రాసిచ్చిన చిలుక పలుకులు. 2018 ఎన్నికల్లో కుడా ఇవే హామీలు ఇచ్చారు. తెలంగాణా ప్రజలు ఆనాడు నమ్మలేదు…ఈ రోజు నమ్మరు…రేపు నమ్మబోరు అని ఎద్దేవా చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.
Rahul Gandhi: ‘పొత్తు గురించి మాట్లాడితే బహిష్కరిస్తాం’