సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు,…
రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరామర్శించారు. సంతోష్ కుంటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిందితులపై సెక్షన్ 306తో పాటు 302,307 సెక్షన్లు కూడా పెట్టాలన్నారు. ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్న జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నట్లు..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు నిందితులను పార్టీ నుండి…
తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఒక్క ఐడియా.. ఇప్పుడు కోట్లు కుమ్మరిస్తోంది.. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన డిస్కౌంట్ ఆఫర్కు అనూహ్యంగా స్పందన వస్తోంది.. చలాన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడడంతో.. కొన్నిసార్లు సర్వర్ మొరాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే.. వాహనదారులు ఏ స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఇక, దీనికి సంబంధించిన తాజా డేటాను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 1వ…
బంజారాహిల్స్లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 20 అంతస్తుల నిర్మాణం కమాండ్ కంట్రోల్ సెంటర్ సి.పి. హైదరాబాద్ కార్యాలయంగా పని చేయడమే కాకుండా సంక్షోభ నివారణ కేంద్రంగా మారబోతుందని తెలిపారు. 4 టవర్ల భవనం, 20 అంతస్తుల మొత్తం ప్రణాళికను మ్యాప్లను అధికారులు సీపీకి వివరించారు. Read Also: మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్…
తెలంగాణ పోలీసులపై లోక్సభ స్పీకర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని…ఎలాంటి మౌఖిక సమాచారం, లిఖితపూర్వక సమాచారం లేకుండా తన ఇంటిని పోలీసులు మోహరించడం ఈ వారంలో ఇది రెండోసారి అని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్రెడ్డి లేఖ రాశారు. Read Also: ఫస్ట్ రేవంత్ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని లేఖలో రేవంత్రెడ్డి ఆరోపించారు.…
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
మావోయిస్ట్ పార్టీ ప్రముఖ నేత ఆర్కే భార్య శిరీష తెలంగాణ పోలీసులపై విమర్శలు చేశారు. ఆర్కేపై వచ్చిన కథనాలను, ఇంటర్వ్యూలను సేకరించి తాను బుక్ తయారుచేసి హైదరాబాద్లో ఆవిష్కరించాలని భావించానని…మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే పుస్తకంలో ప్రస్తావించానని, కానీ ఆ పుస్తకావిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో ఎటువంటి విప్లవ సాహిత్యం లేదన్నారు. పుస్తక ఆవిష్కరణ కోసం డీజీపీ దగ్గర అర్జీ పెట్టుకున్నానని, ఆ తరువాత రోజే పుస్తకం ప్రింట్ చేస్తున్న…
రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్లలో…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు టీఎస్ పోలీసులు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు టీఎస్ పోలీసులు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లను నిలిపివేస్తున్నారు టీఎస్ పోలీసులు. ఇందులో భాగంగానే జగ్గయ్యపేట బోర్డర్ దగ్గర…