Police High Alert: మళ్ళీ మావోయిస్టుల అలజడి… కూంబింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందా?
తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా?
గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అప్రమత్తం అయ్యారు?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాపకింద నీరులా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టుల చర్యలను తింపికొట్టేందుకు ముందస్తుగా పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాలలో కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్,పలిమెల,మహాముత్తారం,మల్హార్ ,కాటారం మండలాలలో పోలీసులు నిత్యం వాహన తనిఖీలు, కార్డన్ సెర్చ్,కల్వర్ట్ తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు.ఈ నెల 1 న మహాముత్తారం మండలం పెగడపల్లి,కనుకునూర్ గ్రామాలలో ప్రధాన రహదారులపై మావోయిస్టులు కరపత్రాలు వదిలి వెళ్లడం కలకలం రేపాయి. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మిలటరీ ఇన్ ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచరించినట్లు తెలుస్తోంది.
అలాగే డబ్బుల కోసం మల్హార్ మండలంలోని ఓ కంపెనీ నిర్వాహకులను కలిసినట్లుగా సమాచారం. పలిమెల మండలం నీలంపల్లి,ముకునూర్ అటవీ ప్రాంతాల్లో తన దళం 11 మంది సభ్యులతో సంచరిస్తున్నాడనే సమాచారంతో గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు.ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారు. గోదావరి తీరం ఫెర్రీ పాయింట్లపై ఖాకీలు కన్ను వేశారు. మంగళవారం మహాముత్తారం మండలంలోమంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పర్యటనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో పర్యటించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మాజీ మావోయిస్టులను ఠాణాకు పిలిపించి పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తూ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తుంది.
Gujarat: సమసిన వివాదం.. ఒకే స్టేజీపై రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..