హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది.
టీఎస్ఆర్టీసీ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ అంతటా ప్రజలకు క్లీనర్, మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పనులు మొదలు పెట్టింది. వచ్చే నెల నుండి హైటెక్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు జరుగుతున్నాయి.
ములుగు జిల్లా రామప్ప దేవాలయం వారసత్వ ఉత్సవాలకు సిద్ధం అయ్యింది. ‘శిల్పం వర్ణం కృష్ణం’ అనే పేరుతో ప్రపంచ వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాని ప్రభుత్వం ఏర్పట్లను పూర్తి చేసింది.
Brain Dead : హైదరాబాదుకు చెందిన 30 ఏళ్ల కార్మికుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది.
సింగరేణిని కొనలేని వారు విశాఖను కొంటారా? అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి, విగ్రహాలు కాదని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్న సందర్భంగా అంబేద్కర్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి తరలిరానున్నారు.
నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలుకు ఫ్రాక్చర్ అయింది. మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పోస్ట్ చేశారు.