Mancherial : మంచిర్యాలలో మహిళ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో మహిళ దారుణ హత్య చేసినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా రెండవ భర్త మధు, స్వప్న శ్రీ మధ్య మూడెకరాల భూమి పట్టా విషయం లో వివాదం నడుస్తుంది. విడాకులు తీసుకున్న తరువాత ఆ భూమీ తన పేరిట పట్టా చేయాలని వేల్పుల మధుకర్ ఒత్తిడి చేయడంతో.. దానికి స్వప్న శ్రీ ఒప్పుకోకపోవడంతో మూడు లక్షలు కట్టితే మొత్తం భూమి తనకు రాయాలని మధు డిమాండ్ చేశాడు.
Also Read : PM Modi: భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
మూడు నెలల్లో మూడు లక్షలు కడితే మధుకు భూమీ రాసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. చెరి సగం అంటూ ఇదివరకు పెద్దలు పంచాయితీ చెప్పారు. మూడు లక్షలు ఇస్తా మొత్తం భూమి కావాలని రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షలు రైతు బందు వచ్చింది ఇంకో లక్ష కడుతానని మధు చెప్పాడు. దానికి స్వప్న శ్రీ ససేమిరా అనింది. అయితే మూడో భర్తతో మంచిర్యాలలో స్వప్న శ్రీ ఉంటుంది. ఇవాళ (శుక్రవారం)మధ్యాహ్నం స్వప్నను ఒంటరిగా చిక్కించుకొని.. ఆమెపై మధుకర్ తో పాటు దుండగుల చేత కత్తులతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది.
Also Read : MenToo Trailer: అబ్బాయిగా బతకడం అంత ఈజీ కాదు బాసూ
పల్సర్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా స్ధానికులు తెలిపారు. వేల్పుల మధూ, ఆయన కుటుంబ సభ్యులే హత్య చేశారని స్వప్ర శ్రీ మూడవ భర్త రవి ఆరోపించాడు. దీంతో ఈ హత్యపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. దళిత బస్తీ మూడెకరాల భూమి విషయంలో గొడవే హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్నారు. అయితే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!