టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది. లేకపోతే శాశ్వతంగా వారిని డిబార్ చేస్తామని స్పష్టం చేసింది కమిషన్. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 37 మందిని మంగళవారం డిబార్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.
Read Also: Krishna: మచిలీపట్నం ప్రభుత్వా ఆసుపత్రిలో అమానుషం..డబ్బులిస్తేనే పోస్ట్మార్టం..
TSPSC ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు తేలింది.
Read Also: Adipurush: ఆదిపురుష్ నుంచి మరో బిగ్ సర్ప్రైజ్..?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు.. సమాధానాలు తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్తో పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఏఐ టెక్నాలజీతో ఎగ్జామ్ రాసిన నిందితులు ప్రశాంత్, మహేశ్, నవీన్లను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ పొందినట్లు తెలిపారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ డివైజ్లు ఎలా వెళ్లాయనే దానిపై సిట్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టీఎస్పీఎస్సీలో రమేష్ ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేశాడు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే రమేష్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పేపర్ లీక్లో ఇప్పటివరకు 43 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.