Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
Warangal: వరంగల్లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఖిలా వరంగల్ తూర్పు కోటలో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం సేవిస్తుండగా మాట మాట పెరగడంతో స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
Harish Rao father death: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని క్రిన్స్విల్లాస్లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచారు. ఈ మరణ వార్త వినగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
హమ్మయ్య ఛేదించారు.. 19వ మృతదేహం అతడిదే..! కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే.. ఈ ఘటనలో…
తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయించే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ లాటరీ ప్రక్రియ రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల ద్వారా నిర్వహించబడనుంది. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు ఆమోదం కూడా అందించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తులను లాటరీ విధానంలో పరిశీలించి, సరైన కేటాయింపును నిర్ణయించనున్నారు. ప్రాంతాల వారీగా…
ఏపీకి హైఅలర్ట్.. రాబోయే మూడు రోజులు ఎక్కడికి వెళ్లొద్దు.. మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ…
Inter Exam Dates: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యా విధానంలో మార్పులతో పాటు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి..
RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
Telangana Govt: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.