Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- గాలివాన దెబ్బకు నిర్మాణ స్థలంలో భారీ ప్రమాదం
- పది మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు
- రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింపు.. దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crane Accident : హైదరాబాద్ నగర శివార్లలోని శంకర్ పల్లి పరిధిలో ఉన్న ఎన్సీసీ (NCC) కన్స్ట్రక్షన్ కంపెనీలో సోమవారం సాయంత్రం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణ రంగ పనుల్లో భాగంగా వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గాలివాన తీవ్రతకు నిర్మాణ స్థలంలో ఉన్న క్రేన్ తన పట్టు కోల్పోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిలో నిమగ్నమై ఉన్న కార్మికులు క్రేన్ కింద చిక్కుకుపోయారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కూడా తొలత కొంత కష్టంగా మారింది.
ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ల ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రేన్ కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో శిథిలాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన వలస కార్మికులుగా తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ అవాంఛనీయ ఘటనతో ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, వాతావరణ పరిస్థితులతో పాటు క్రేన్ నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!