Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- 20 రోజులుగా అలాగే ఉన్న గుంత.. ఎవరికీ పట్టలేదా?
- ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో పడ్డ చిన్నారి
- కాపాడేందుకు దూకిన తల్లి, అక్క.. కానీ ఆలస్యమైంది
- అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం.. న్యాయం కోరుతూ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల క్రితం అధికారులు మరమ్మత్తుల కోసం 4 మీటర్ల లోతున భారీ గుంతను తవ్వారు. అయితే, మరమ్మత్తులు పూర్తయినా లేదా మధ్యలో నిలిచిపోయినా, ఆ గుంతను పూడ్చకుండా అధికారులు అలాగే వదిలేశారు. గత మూడు వారాలుగా ఆ మృత్యు గుంత పాఠశాల ముందే దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా దాని భద్రత గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో కవిత అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలు దక్షిత , మోక్షితలను వెంటబెట్టుకుని పాఠశాలకు వచ్చింది. తల్లి లోపలికి వెళ్లిన క్రమంలో, ఆడుకుంటూ వెళ్లిన మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. పక్కనే ఉన్న అక్క దక్షిత ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడంతో, కవిత పరుగులు తీస్తూ వచ్చి తన చిన్నారిని కాపాడుకునేందుకు గుంతలోకి దూకింది. కవితతో పాటు దక్షిత కూడా గుంతలోకి దూకింది.
గుంతలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి కవిత, అక్క దక్షిత ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐదేళ్ల మోక్షిత అప్పటికే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మిషన్ భగీరథ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే మోక్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుటే అంత లోతైన గుంతను 20 రోజుల పాటు పూడ్చకుండా వదిలేయడం అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమేనని వారు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలీంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!