Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- 20 రోజులుగా అలాగే ఉన్న గుంత.. ఎవరికీ పట్టలేదా?
- ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో పడ్డ చిన్నారి
- కాపాడేందుకు దూకిన తల్లి, అక్క.. కానీ ఆలస్యమైంది
- అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం.. న్యాయం కోరుతూ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల క్రితం అధికారులు మరమ్మత్తుల కోసం 4 మీటర్ల లోతున భారీ గుంతను తవ్వారు. అయితే, మరమ్మత్తులు పూర్తయినా లేదా మధ్యలో నిలిచిపోయినా, ఆ గుంతను పూడ్చకుండా అధికారులు అలాగే వదిలేశారు. గత మూడు వారాలుగా ఆ మృత్యు గుంత పాఠశాల ముందే దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా దాని భద్రత గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో కవిత అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలు దక్షిత , మోక్షితలను వెంటబెట్టుకుని పాఠశాలకు వచ్చింది. తల్లి లోపలికి వెళ్లిన క్రమంలో, ఆడుకుంటూ వెళ్లిన మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. పక్కనే ఉన్న అక్క దక్షిత ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడంతో, కవిత పరుగులు తీస్తూ వచ్చి తన చిన్నారిని కాపాడుకునేందుకు గుంతలోకి దూకింది. కవితతో పాటు దక్షిత కూడా గుంతలోకి దూకింది.
గుంతలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి కవిత, అక్క దక్షిత ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐదేళ్ల మోక్షిత అప్పటికే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మిషన్ భగీరథ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే మోక్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుటే అంత లోతైన గుంతను 20 రోజుల పాటు పూడ్చకుండా వదిలేయడం అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమేనని వారు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలీంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..