Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- 20 రోజులుగా అలాగే ఉన్న గుంత.. ఎవరికీ పట్టలేదా?
- ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో పడ్డ చిన్నారి
- కాపాడేందుకు దూకిన తల్లి, అక్క.. కానీ ఆలస్యమైంది
- అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం.. న్యాయం కోరుతూ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల క్రితం అధికారులు మరమ్మత్తుల కోసం 4 మీటర్ల లోతున భారీ గుంతను తవ్వారు. అయితే, మరమ్మత్తులు పూర్తయినా లేదా మధ్యలో నిలిచిపోయినా, ఆ గుంతను పూడ్చకుండా అధికారులు అలాగే వదిలేశారు. గత మూడు వారాలుగా ఆ మృత్యు గుంత పాఠశాల ముందే దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా దాని భద్రత గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో కవిత అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలు దక్షిత , మోక్షితలను వెంటబెట్టుకుని పాఠశాలకు వచ్చింది. తల్లి లోపలికి వెళ్లిన క్రమంలో, ఆడుకుంటూ వెళ్లిన మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. పక్కనే ఉన్న అక్క దక్షిత ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడంతో, కవిత పరుగులు తీస్తూ వచ్చి తన చిన్నారిని కాపాడుకునేందుకు గుంతలోకి దూకింది. కవితతో పాటు దక్షిత కూడా గుంతలోకి దూకింది.
గుంతలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి కవిత, అక్క దక్షిత ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐదేళ్ల మోక్షిత అప్పటికే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మిషన్ భగీరథ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే మోక్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుటే అంత లోతైన గుంతను 20 రోజుల పాటు పూడ్చకుండా వదిలేయడం అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమేనని వారు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలీంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!