Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- 20 రోజులుగా అలాగే ఉన్న గుంత.. ఎవరికీ పట్టలేదా?
- ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో పడ్డ చిన్నారి
- కాపాడేందుకు దూకిన తల్లి, అక్క.. కానీ ఆలస్యమైంది
- అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం.. న్యాయం కోరుతూ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల క్రితం అధికారులు మరమ్మత్తుల కోసం 4 మీటర్ల లోతున భారీ గుంతను తవ్వారు. అయితే, మరమ్మత్తులు పూర్తయినా లేదా మధ్యలో నిలిచిపోయినా, ఆ గుంతను పూడ్చకుండా అధికారులు అలాగే వదిలేశారు. గత మూడు వారాలుగా ఆ మృత్యు గుంత పాఠశాల ముందే దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా దాని భద్రత గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రంలో కవిత అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలు దక్షిత , మోక్షితలను వెంటబెట్టుకుని పాఠశాలకు వచ్చింది. తల్లి లోపలికి వెళ్లిన క్రమంలో, ఆడుకుంటూ వెళ్లిన మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. పక్కనే ఉన్న అక్క దక్షిత ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడంతో, కవిత పరుగులు తీస్తూ వచ్చి తన చిన్నారిని కాపాడుకునేందుకు గుంతలోకి దూకింది. కవితతో పాటు దక్షిత కూడా గుంతలోకి దూకింది.
గుంతలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి కవిత, అక్క దక్షిత ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐదేళ్ల మోక్షిత అప్పటికే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మిషన్ భగీరథ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే మోక్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుటే అంత లోతైన గుంతను 20 రోజుల పాటు పూడ్చకుండా వదిలేయడం అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమేనని వారు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలీంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!