హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో…
Power Bill Hike: తెలంగాణ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై ఈఆర్సీ స్పందించింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదని ఈఆర్సీ తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి టారిఫ్ పెంపు కానీ, ‘టైమ్ ఆఫ్ ద డే’ ఛార్జీల పెంపు కానీ ఉండబోదని ఈఆర్సీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదికి సుమారు ₹50,242 కోట్ల ఆదాయ అవశ్యకత ఉంటుందని అంచనా వేసిన సంస్థ, ప్రస్తుత ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం ₹40,659…
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చెత్త సేకరణకు సంబంధించి…
మాదిగ సామాజిక వర్గ హక్కుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్’ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం తనకు గర్వకారణమని చాటిచెప్పారు. గత ఇరవై ఏళ్లుగా మాదిగ వర్గీకరణ పోరాటాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. “నాడు అసెంబ్లీలో వర్గీకరణ కోసం గళమెత్తితే,…
GHMC Debts: హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై ఉన్న భారీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై ప్రస్తుతం సుమారు రూ. 4,780 కోట్ల అప్పులు ఉండగా, వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. అప్పులను ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడే…
Telangana Government: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో…
ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్…
తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ…
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా (BioAsia) 2026 అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 17 నుండి భాగ్యనగరంలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని హైటెక్స్ (HITEX) వేదికగా రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది సదస్సును ‘టెక్బయో అన్లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed –…
BioAsia 2026 in Hyderabad: లైఫ్ సైన్సెస్ , హెల్త్కేర్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సదస్సుగా గుర్తింపు పొందిన ‘బయో ఏషియా’ తన 23వ ఎడిషన్తో హైదరాబాద్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు, ఈ ఏడాది “టెక్బయో అన్లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” అనే శక్తివంతమైన ఇతివృత్తంతో జరగనుంది. ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి…