రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది.
రైతులకు రెవెన్యూ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
Telangana Joint Staff Council Appointed: ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.
నేపాల్లో నెలకొన్న అల్లర్లు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అక్కడి పౌరులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది.
తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా వేడుకలు ఇంకో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దసరా పండగ అనగానే విద్యార్థులకు సెలవులే గుర్తొస్తాయి. భారీగా సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్ వెళ్లే పనే ఉండదు.. హ్యాపీగా ట్రిప్స్ కు వెళ్లొచ్చు.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అని భావిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కూల్లకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21…
తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం)…