Ponguleti Srinivas Reddy: రూ. 500 బోనస్పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఆరువేల పైచిలుకు రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. సున్నా వడ్డీతో 65 లక్షల మంది మహిళలకు రూ. 25 వేల కోట్ల రుణాలు ఇచ్చామని చెప్పారు.
READ MORE: AP Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి! కరస్పాండెంట్పై పోక్సో కేసు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
గతంలో డ్వాక్రా గ్రూప్ సభ్యురాలుగా 18 సంవత్సరాలు ఉన్న మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చేవారని.. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అవకాశం ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకే తగ్గిస్తూ 60 సంవత్సరాల వయసుని 65వ సంవత్సరాలకు పెంచుతూ జీవో ఇచ్చిందని తెలిపారు. కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయటమే మన ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి ఐదువేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ భారంగా భావించటం లేదని.. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు. పేదల ఇంటి పెద్ద కొడుకులా తాను ప్రజలతో ఉంటానని హామీ ఇచ్చారు.
READ MORE: US-India Trade: ట్రంప్ సంచలన ప్రకటన.. ఆగస్టు 1 నుంచి భారత్పై 25% సుంకాలు..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!