Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Telangana Urea Shortage Khammam Minister Tummala Nageswara Rao

Minister Thummala: తెలంగాణలో యూరియా కొరత..కేంద్రంపై తుమ్మల ఆగ్రహం

Published Date :July 27, 2025 , 11:57 am
By Bhargav Chaganti
  • ఖమ్మం సహా తెలంగాణలో యూరియా కొరత
  • రైతులు తీవ్ర ఇబ్బందుల్లో, కేంద్రంపై మంత్రి తుమ్మల ఆగ్రహం
  • మార్చి నుంచి యూరియా సరఫరా కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినా స్పందన లేదు: తుమ్మల
Minister Thummala: తెలంగాణలో యూరియా కొరత..కేంద్రంపై తుమ్మల ఆగ్రహం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంచి వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని యూరియా సరఫరా కోసం విజ్ఞప్తి చేస్తున్నామని, ఢిల్లీకి వెళ్లి నేరుగా అధికారులను కలిసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లభించడం లేదని వాపోయారు. ఏప్రిల్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం ఆ మొత్తాన్ని అందించలేదని ఆయన అన్నారు. మే నెలలో కూడా హామీ ఇచ్చిన మొత్తాన్ని సరఫరా చేయకపోగా, జూన్‌లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికకు బదులుగా కేవలం 98,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించారని ఆయన వివరించారు. జూలై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ప్రణాళికలో 6.60 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 3.70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Double Bedroom Scam: డబుల్ బెడ్‌రూమ్ స్కామ్‌లో మోసపోయిన 83 మంది.. ఎవరు చేశారో తెలుసా?

Also Read

  • Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
  • Khammam : భూదాన్‌ భూముల వివాదంపై సర్కార్‌ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
  • Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
  • Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
Add as a preferred
source on google

“కేంద్రం చెప్పేది ఒకటి, పంపించేది దానికంటే చాలా తక్కువగా ఉంది. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొరత వల్ల ఖరీఫ్ సీజన్‌లో పంటల ఉత్పత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉంది,” అని తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, 2.37 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాబోయే నాలుగైదు రోజుల్లో సరఫరా చేయాలని కోరారు. మంత్రి తుమ్మల బీజేపీ నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు. “రైతుల మీద అవగాహన ఉంటే, కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి యూరియా సరఫరా జరిగేలా చేయండి. రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేయడం మంచిది కాదు. మీకు పలుకుబడి ఉన్న మేరకు కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతుల బాధలు తీర్చండి,” అని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture
  • bandi sanjay
  • bjp
  • central government
  • Farmers

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions