సిద్దపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని తిరిగివెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన పెద్ద గుంతలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
భర్త వేధింపులు తాళలేక వివాహింత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా మదనాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆటోమేటిక్ సైఫన్స్ తెరుచుకోవడంతో కాజ్ వే పై నుంచి నీరు ప్రవహిస్తుంది. నదిపై నిర్మించిన లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు మహిళలతో వస్తున్న వ్యక్తి కాజ్ వే దాటుతుండగా.. అదుపు తప్పి బైక్తో సహా నదిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. ముగ్గురు కొట్టుకుపోతున్నారు.