కష్టాల్లోనూ, సంతోషాల్లోనూ తోడుగా ఉండాల్సిన భర్త , ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెండ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే భార్యపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కూతుళ్లు వద్దంటున్నా మాట వినకుండా కఠినంగా ప్రవర్తించాడు.
సిద్దపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని తిరిగివెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన పెద్ద గుంతలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.