Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన
- అతిథులను ఎండలో నడిపించి గొడుగు కింద నడిచిన షరీఫ్
- సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరైనా విదేశీ అతిథులు వచ్చినప్పుడు చాలా గౌరవంగా.. రెడ్ కార్పె్ట్ వేసి ఘనంగా స్వాగతం పలుకుతారు. కానీ పాకిస్థాన్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం చాలా వింతగా ప్రవర్తించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా అతిథులకు మర్యాద ఇవ్వకుండా.. తాను మాత్రమే గొడుగు కింద నడుస్తూ.. అతిథులు ఎండలో నడిచేలా చేశారు. ఆశ్చర్యంగా పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీకి గొడుగు వేయబోతుండగా సున్నితంగా తిరస్కరించారు. అతిథులు కాకుండా తాను మాత్రమే గొడుగు కింద నడవడంతో షరీఫ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు. ఇస్లామాబాద్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్లో అతిథులకు షరీఫ్, జర్దారీ స్వాగతం పలికారు. ఆ సమయంలో చాలా ఎండగా ఉంది. అయితే షెహబాజ్ షరీఫ్ గొడుగు కింద నడుస్తుండగా.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీని మాత్రం ఎండలో నడిపించారు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అతిథిగా వచ్చిన దేశాధ్యక్షుడికి గొడుగు ఇవ్వకుండా ఎలా వ్యవహరించారు? తీవ్ర ఎండలో విదేశీ నేతలను నిలబెట్టి.. తాను మాత్రం గొడుగు కింద నడవడం సరైన మర్యాదేనా?’’ అంటూ ప్రశ్నించారు. కొందరు ఈ ఘటనను దౌత్య మర్యాదలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ చిన్న ఘటనతో పెద్ద చర్చ నడుస్తున్నప్పటికీ.. ఇరాన్ అధ్యక్షుడి పర్యటన దౌత్యపరంగా కీలకంగా నిలిచింది. ఇస్లామాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల్లో ఇరాన్, పాకిస్థాన్ మధ్య వాణిజ్యం, వ్యవసాయం, భద్రత, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చించారు. ఇరాన్కు అవసరమైన మాంసం దిగుమతుల్లో 60 శాతం వరకు పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ అధికారులు ప్రస్తావించారు.
ఇరుదేశాలు ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సంబంధాల బలోపేతంపై సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకరించాయి. ఈ పర్యటనలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో కూడా సమావేశమయ్యారు. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల తర్వాత మసూద్ పెజెష్కియన్ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. అయితే దౌత్యపరంగా కీలకమైన ఈ పర్యటనలో జరిగిన గొడుగు ఘటన మాత్రం సోషల్ మీడియాలో ప్రధాన చర్చాంశంగా మారింది.
Prime Minister Shehbaz Sharif refused to handover the umbrella to President Asif Ali Zardari. 🤯pic.twitter.com/0eXpcXBJlt
— Rayham. (@RayhamUnplugged) June 23, 2026
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!