Hyderabad: చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు.. దేవుడి చాటున గలీజ్ దందా..?
- గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం
- ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు
- హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్న ఇంట్లోని వారు
- పోలీసులు పూజ గది వైపు వెళ్లేసరికి ముఖ కవళికల్లో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..? పూజల చాటున చేస్తున్న కంత్రీ పని ఏంటి..? చూస్తుంటే… ఎవరో ఆధ్యాత్మికవేత్త ఇల్లు ఉన్నట్టుంది అనుకుంటున్నారా..? సకల దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి… పూజలు కూడా బాగా చేశారు అనుకుంటున్నారా..? ఇదిగిదిగో.. ఇప్పుడు చూడండి.. దేవుడి పటాల వెనుక ఉన్న ప్యాకెట్లు బయటపడుతున్నాయి. ఆ ప్యాకెట్లలో ఏముందో తెలుసా..? గంజాయి..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
నిజానికి ఈ ఇంట్లో గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ ఇంట్లో సెర్చ్ చేసేందుకు వచ్చారు. ఇల్లంతా కలియ దిరిగారు. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు. పైగా ఇంట్లోని వారంతా ఎలాంటి హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్నారు. వారి వాలకం చూసి అప్పటికే పోలీసులు అనుమానించారు. మరోవైపు ఇంటి యజమానిగా ఉన్న వ్యక్తి సైతం గంభీరంగానే ఉన్నాడు. కానీ పోలీసులు పూజ గది వైపు వెళ్లే సరికి అతని ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. దీంతో దేవుడి చిత్ర పటాల వెనుక చూడగానే అసలు నిజం బయటపడింది.. ధూల్పేట్లో రోహన్ సింగ్ చేస్తున్న గంజాయి దందా బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తంగా అతని ఇంటి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ముఠా ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకు వస్తోంది. దాన్ని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి మాదాపూర్తోపాటు ఐటి ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..
READ MORE: Viral Video: ట్రెండింగ్లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!