Hyderabad: చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు.. దేవుడి చాటున గలీజ్ దందా..?
- గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం
- ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు
- హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్న ఇంట్లోని వారు
- పోలీసులు పూజ గది వైపు వెళ్లేసరికి ముఖ కవళికల్లో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..? పూజల చాటున చేస్తున్న కంత్రీ పని ఏంటి..? చూస్తుంటే… ఎవరో ఆధ్యాత్మికవేత్త ఇల్లు ఉన్నట్టుంది అనుకుంటున్నారా..? సకల దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి… పూజలు కూడా బాగా చేశారు అనుకుంటున్నారా..? ఇదిగిదిగో.. ఇప్పుడు చూడండి.. దేవుడి పటాల వెనుక ఉన్న ప్యాకెట్లు బయటపడుతున్నాయి. ఆ ప్యాకెట్లలో ఏముందో తెలుసా..? గంజాయి..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
నిజానికి ఈ ఇంట్లో గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ ఇంట్లో సెర్చ్ చేసేందుకు వచ్చారు. ఇల్లంతా కలియ దిరిగారు. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు. పైగా ఇంట్లోని వారంతా ఎలాంటి హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్నారు. వారి వాలకం చూసి అప్పటికే పోలీసులు అనుమానించారు. మరోవైపు ఇంటి యజమానిగా ఉన్న వ్యక్తి సైతం గంభీరంగానే ఉన్నాడు. కానీ పోలీసులు పూజ గది వైపు వెళ్లే సరికి అతని ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. దీంతో దేవుడి చిత్ర పటాల వెనుక చూడగానే అసలు నిజం బయటపడింది.. ధూల్పేట్లో రోహన్ సింగ్ చేస్తున్న గంజాయి దందా బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తంగా అతని ఇంటి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ముఠా ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకు వస్తోంది. దాన్ని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి మాదాపూర్తోపాటు ఐటి ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..
READ MORE: Viral Video: ట్రెండింగ్లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?