Hyderabad: చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు.. దేవుడి చాటున గలీజ్ దందా..?
- గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం
- ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు
- హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్న ఇంట్లోని వారు
- పోలీసులు పూజ గది వైపు వెళ్లేసరికి ముఖ కవళికల్లో మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెప్పేవి శ్రీరంగనీతులు… దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..? పూజల చాటున చేస్తున్న కంత్రీ పని ఏంటి..? చూస్తుంటే… ఎవరో ఆధ్యాత్మికవేత్త ఇల్లు ఉన్నట్టుంది అనుకుంటున్నారా..? సకల దేవతామూర్తుల చిత్రపటాలు ఉన్నాయి… పూజలు కూడా బాగా చేశారు అనుకుంటున్నారా..? ఇదిగిదిగో.. ఇప్పుడు చూడండి.. దేవుడి పటాల వెనుక ఉన్న ప్యాకెట్లు బయటపడుతున్నాయి. ఆ ప్యాకెట్లలో ఏముందో తెలుసా..? గంజాయి..
READ MORE: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
నిజానికి ఈ ఇంట్లో గంజాయి ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ ఇంట్లో సెర్చ్ చేసేందుకు వచ్చారు. ఇల్లంతా కలియ దిరిగారు. కానీ ఎక్కడా గంజాయి ఆనవాళ్లు కనిపించలేదు. పైగా ఇంట్లోని వారంతా ఎలాంటి హైరానా పడకుండా సైలెంట్గా కూర్చున్నారు. వారి వాలకం చూసి అప్పటికే పోలీసులు అనుమానించారు. మరోవైపు ఇంటి యజమానిగా ఉన్న వ్యక్తి సైతం గంభీరంగానే ఉన్నాడు. కానీ పోలీసులు పూజ గది వైపు వెళ్లే సరికి అతని ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. దీంతో దేవుడి చిత్ర పటాల వెనుక చూడగానే అసలు నిజం బయటపడింది.. ధూల్పేట్లో రోహన్ సింగ్ చేస్తున్న గంజాయి దందా బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తంగా అతని ఇంటి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.. రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ముఠా ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తీసుకు వస్తోంది. దాన్ని 5, 10, 15, 20 గ్రాముల్లో చిన్న ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి మాదాపూర్తోపాటు ఐటి ఏరియాలో ఉన్న తమ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..
READ MORE: Viral Video: ట్రెండింగ్లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!