Tejashwi Yadav: 2029లో రాహుల్గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం
- 2029లో రాహుల్గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం
- ఓటర్ అధికార్ యాత్రలో తేజస్వి యాదవ్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2029 లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమి పని చేస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో తేజస్వి యాదవ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. 2029 లోక్సభ ఎన్నికలకు రాహుల్ గాంధీని ఇండియా కూటమి ప్రధానమంత్రిగా నిలబెట్టాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్లోని నవాడాలో జరిగిన ఓటర్ అధికార్ ర్యాలీలో రాహుల్ పక్కన ఉండగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: US: రెస్టారెంట్లో ఫుడ్ ఆరగిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
Also Read
అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం పని చేస్తోందని.. ఓట్ల చోరీ కోసమే ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీహార్ ప్రజలను మోసం చేయడానికి ఎన్డీఏ-ఈసీ కుట్రకు పూనుకున్నాయని పేర్కొన్నారు. బ్రతికున్న వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పినట్లుగానే ఈసీ పని చేస్తుందన్నారు. ఎన్డీఏ కూటమిని దించితేనే బీహార్ బాగుపడుతుంందన్నారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్రెడ్డి.. తెలంగాణ వ్యక్తి పేరు ప్రకటించిన ఖర్గే
బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీలో విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. అధికార పార్టీకి ఈసీ తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.
తాజావార్తలు
-
RaviMohan : జయంరవి చెప్పిన మూడక్షరాల ఇడ్లి నటి ఆమేనా?
-
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
-
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..