Bihar Elections: లాలూ కుటుంబంలో ముదిరిన వివాదం..
- బీహార్ ఎన్నికల ముందు లాలూ ఫ్యామిలీలో విభేదాలు..
- తేజస్వీ, మీసా భారతిలను అన్ఫాలో చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది. లాలూ కుటుంబంలో తీవ్ర విభేదాలు ముసురుకున్నాయి. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ , తన అక్క మీసా భారతిలను ఎక్స్లో అన్ఫాలో చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ చర్య కుటుంబంలో చీలిక గురించి కొత్త ఊహాగానాలకు దారి తీసింది.
Read Also: Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఆర్జేడీ నుంచి సస్పెన్షన్కు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా జనశక్తి జనతాదళ్ (జెజెడి) పార్టీని ప్రారంభించారు. అక్టోబర్ 13న తన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం, తేజ్ ప్రతాప్ తండ్రి లాలూ, తల్లి రబ్రీదేవీ, చెల్లెలు రాజ్ లక్ష్మీ యాదవ్లను మాత్రమే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. మరో సోదరి హేమా యాదవ్ను అంతకుముందు అన్ఫాలో చేశారు. కుటుంబ విభేదాలు ఇప్పుడు లాలూ కుటుంబంలో రాజకీయ వివాదాలుగా మారాయి. కొడుకు కొత్త పార్టీ పెట్టడం ఆర్జేడీలో చాలా మందికి నచ్చడం లేదు. తేజ్ ప్రతాప్ వచ్చే ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి, నవంబర్ 14న లెక్కింపు జరుగుతుంది.
ఇటీవల ఫేస్ బుక్ వేదికగా తను ఓ అమ్మాయితో ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నానని ప్రకటించడం మొత్తం వివాదానికి కారణమైంది. ఇదే కుటుంబంలో చిచ్చుపెట్టింది. క్రమశిక్షణా చర్యల కింద లాలూ, తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి బహిష్కరించారు. తేజ్ ప్రతాప్కు గతంలో మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్ తో వివాహమైంది, ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.
తాజావార్తలు
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!