Tejashwi Yadav: “ఎన్నికల్ని బహిష్కరిస్తాం”, బీహార్ పోల్స్పై తేజస్వీ యాదవ్ సంచలనం..
- ‘‘ఎన్నికలను బహిష్కరిస్తాం’’..
- బీహార్ అసెంబ్లీ పోల్స్పై తేజస్వీ సంచలన వ్యాఖ్యలు..
- ఈసీ బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇప్పటికే, పాలక బీజేపీ-జేడీయూ కూటమితో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి., మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ద్వారా ఫేక్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్తో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలను ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఆర్జేడీ-కాంగ్రెస్- వామపక్షాల కూటమి) బహిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ‘‘నకిలీ ఓటర్ల జాబితాను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే, వారిని నడపనివ్వండి. మొత్తం ప్రక్రియ నిజాయితీ లేనిది, ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటి..? అని తేజస్వీ ప్రశ్నించారు.
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
Read Also: Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..
‘‘ఎన్నికలను బహిష్కరించడం అనేది ఒక ఛాయిస్, దీని గురించి మేము ఆలోచిస్తాము. తుది నిర్ణయం తీసుకునే ముందు మా కూటమి భాగస్వాములను, ప్రజలను సంప్రదిస్తాము’’ అని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతిపక్షాల ఆందోళనల్ని పరిష్కరించలేదని, నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది, తొలగించి ఓటర్ల గణాంకాలను సుప్రీంకోర్టు ముందు ప్రదర్శించేందుకు బిజీగా ఉందని తేజస్వీ యాదవ్ విమర్శించారు. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎంచుకుంటోందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం మోసపూరిత ప్రచారమని చెప్పారు.
“బీహార్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, మరియు దానిని గొంతు నొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ అంశంపై చర్చను సైలెంట్ చేయాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ చూస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల అవకతవకల ఆరోపణలకు కూడా తేజస్వీ మద్దతు ఇచ్చారు. ఇండియా కూటమి సీట్ల పంపంకం, నాయకత్వ నిర్ణయాలు ఖరారయ్యాని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!