Bihar: ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- శ్రావణమాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరాకటంలో పడేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా మటన్ పాలిటిక్స్ రాష్ట్రంలో హీటెక్కిస్తోంది.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
ప్రస్తుతం దేశంలో శ్రావణమాసం నడుస్తోంది. అయితే శ్రావణమాసంలో హిందువులు నాన్వెజ్ తినరు. కానీ సోమవారం ఎన్డీఏ సమావేశంలో నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. పాట్నాలోని అసెంబ్లీలో జరిగిన విందు వంటకాల్లో మటన్ లేబుల్ కనిపించింది. దీంతో శ్రావణమాసంలో మటన్ ఆరగించడమేంటి? అని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులను విమర్శిస్తారు కానీ.. తమ విషయంలో మాత్రం సనాతన ధర్మం పాటించారా? అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
మటన్ తిన్నవారిలో మోడీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని.. శ్రావణమాసంలో రోజుకు 3 కిలోల మటన్ తింటారని.. కానీ ఇతరులకు సనాతన ధర్మం గురించి బోధిస్తారంటూ ఎద్దేవా చేశారు. తినే ఆహారంపై తమకు అభ్యంతరం లేదు గానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శిస్తారంటూ ధ్వజమెత్తారు.
2023 శ్రావణ మాసంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ భోజనం ఆతిథ్యం ఇచ్చారు. ఆనాటి దృశ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!