Bihar: ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- ఎన్నికల ముందు బీహార్ను కుదిపేస్తున్న మటన్ పాలిటిక్స్
- శ్రావణమాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఏ చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరాకటంలో పడేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా మటన్ పాలిటిక్స్ రాష్ట్రంలో హీటెక్కిస్తోంది.
ఇది కూడా చదవండి: Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ప్రస్తుతం దేశంలో శ్రావణమాసం నడుస్తోంది. అయితే శ్రావణమాసంలో హిందువులు నాన్వెజ్ తినరు. కానీ సోమవారం ఎన్డీఏ సమావేశంలో నాన్ వెజ్ వంటకాలు ఏర్పాటు చేశారు. పాట్నాలోని అసెంబ్లీలో జరిగిన విందు వంటకాల్లో మటన్ లేబుల్ కనిపించింది. దీంతో శ్రావణమాసంలో మటన్ ఆరగించడమేంటి? అని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇతరులను విమర్శిస్తారు కానీ.. తమ విషయంలో మాత్రం సనాతన ధర్మం పాటించారా? అంటూ నిలదీశారు. ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
మటన్ తిన్నవారిలో మోడీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారని.. శ్రావణమాసంలో రోజుకు 3 కిలోల మటన్ తింటారని.. కానీ ఇతరులకు సనాతన ధర్మం గురించి బోధిస్తారంటూ ఎద్దేవా చేశారు. తినే ఆహారంపై తమకు అభ్యంతరం లేదు గానీ.. ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శిస్తారంటూ ధ్వజమెత్తారు.
2023 శ్రావణ మాసంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ భోజనం ఆతిథ్యం ఇచ్చారు. ఆనాటి దృశ్యాలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం శ్రావణ మాసంలో ఎన్డీఏ నేతలు మాంసాహారం తినడంపై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
प्रधानमंत्री श्री @narendramodi जी के असीम आशीर्वाद और कृपा से सावन के सोमवारी को दबा कर मटन 🥩 चापते बीजेपी के मंत्री और विधायक।
मोदी जी की कैबिनेट में बिहार से तीन ऐसे मंत्री है जो सावन में भी प्रतिदिन 3 किलो मटन खाते है लेकिन दिखावटी तौर पर सनातन पर लंबा चौड़ा ज्ञान देते है।… pic.twitter.com/NuvuOwEzKy
— Tejashwi Yadav (@yadavtejashwi) July 21, 2025
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!