Bihar: ఎన్నికల ముందు లాలూ కుటుంబంలో వివాదాలు.. కుమార్తె వరస పోస్టులతో కలవరం..
- లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదాలు..
- కుమార్తె రోహిణి ఆచార్య వరస పోస్టులు..
- తేజస్వీ యాదవ్తో విభేదాలు..
Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు మరో కొడుకు తేజస్వీ యాదవ్తో పొసగడం లేదు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ పై వీరిద్దరు విమర్శలు చేస్తున్నారు.
మే నెలలో లాలూ పెద్ద కొడుక తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్, సంజయ్ను ‘‘జైచంద్’’(ద్రోహి)గా అభివర్ణించాడు.ఇటీవల బీహార్ అధికార్ యాత్ర సమయంలో, తేజస్వీ ప్రచార వాహనంలో ముందు సీటులో సంజయ్ కూర్చుని కనిపించాడు. సాధారణంగా ముందు సీటు అగ్రనాయకత్వానికి కేటాయిస్తారు. సంజయ్ ఆ సీటులో కూర్చున్న ఫోటో వైరల్గా మారింది. దీనిపై రోహిణి స్పందిస్తూ..‘సంజయ్ పేరు చెప్పకుండా, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా “వ్యూహకర్తలు” లాగా కనిపించడం ద్వారా తమను తాము నాయకత్వం కంటే ఎక్కువగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ ప్రజలు అలాంటి యాత్రల సమయంలో తేజస్వి లేదా లాలూను వాహనాల ముందు సీటులో కూర్చోబెట్టడం అలవాటు చేసుకున్నారని కూడా అది పేర్కొంది.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Bengaluru: అసలు మీరు మనుషులేనా.. ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని..
ఇది లాలూ కుటుంబంతో తీవ్ర వివాదాన్ని సూచిస్తోంది. పార్టీలో సంజయ్ పాత్ర పెరగడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “సామాజిక- ఆర్థిక న్యాయం కోసం లాలూ ప్రసాద్ ప్రచార లక్ష్యం అణగారిన వర్గాలను, సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఉద్ధరించడం” అని రోహిణి ట్వీట్ చేసింది. ఇలా వరస ట్వీట్లు ఆ కుటుంబంలో వివాదాలను సూచిస్తున్నాయి. పార్టీలో, కుటుంబలో ఆమెపై వ్యతిరేకత రావడంతో రోహిణి ఆచార్య తన తండ్రి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసింది. 2022లో లాలూ ప్రసాద్కు రోహిణి తన కిడ్నీ ఇచ్చింది. దీనిపై ఆమె ‘‘జీవితాలను పణంగా పెట్టి అతిపెద్ద త్యాగాలు చేసే ధైర్యం ఉన్నవారు తమ రక్తంలో నిర్భయత, నిష్కపటత్వం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు’’ అని పేర్కొంది. తాను ఒక కుమార్తెగా, సోదరిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?