Bihar: ఎన్నికల ముందు లాలూ కుటుంబంలో వివాదాలు.. కుమార్తె వరస పోస్టులతో కలవరం..
- లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదాలు..
- కుమార్తె రోహిణి ఆచార్య వరస పోస్టులు..
- తేజస్వీ యాదవ్తో విభేదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు మరో కొడుకు తేజస్వీ యాదవ్తో పొసగడం లేదు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ పై వీరిద్దరు విమర్శలు చేస్తున్నారు.
మే నెలలో లాలూ పెద్ద కొడుక తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్, సంజయ్ను ‘‘జైచంద్’’(ద్రోహి)గా అభివర్ణించాడు.ఇటీవల బీహార్ అధికార్ యాత్ర సమయంలో, తేజస్వీ ప్రచార వాహనంలో ముందు సీటులో సంజయ్ కూర్చుని కనిపించాడు. సాధారణంగా ముందు సీటు అగ్రనాయకత్వానికి కేటాయిస్తారు. సంజయ్ ఆ సీటులో కూర్చున్న ఫోటో వైరల్గా మారింది. దీనిపై రోహిణి స్పందిస్తూ..‘సంజయ్ పేరు చెప్పకుండా, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా “వ్యూహకర్తలు” లాగా కనిపించడం ద్వారా తమను తాము నాయకత్వం కంటే ఎక్కువగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ ప్రజలు అలాంటి యాత్రల సమయంలో తేజస్వి లేదా లాలూను వాహనాల ముందు సీటులో కూర్చోబెట్టడం అలవాటు చేసుకున్నారని కూడా అది పేర్కొంది.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Bengaluru: అసలు మీరు మనుషులేనా.. ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని..
ఇది లాలూ కుటుంబంతో తీవ్ర వివాదాన్ని సూచిస్తోంది. పార్టీలో సంజయ్ పాత్ర పెరగడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “సామాజిక- ఆర్థిక న్యాయం కోసం లాలూ ప్రసాద్ ప్రచార లక్ష్యం అణగారిన వర్గాలను, సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఉద్ధరించడం” అని రోహిణి ట్వీట్ చేసింది. ఇలా వరస ట్వీట్లు ఆ కుటుంబంలో వివాదాలను సూచిస్తున్నాయి. పార్టీలో, కుటుంబలో ఆమెపై వ్యతిరేకత రావడంతో రోహిణి ఆచార్య తన తండ్రి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసింది. 2022లో లాలూ ప్రసాద్కు రోహిణి తన కిడ్నీ ఇచ్చింది. దీనిపై ఆమె ‘‘జీవితాలను పణంగా పెట్టి అతిపెద్ద త్యాగాలు చేసే ధైర్యం ఉన్నవారు తమ రక్తంలో నిర్భయత, నిష్కపటత్వం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు’’ అని పేర్కొంది. తాను ఒక కుమార్తెగా, సోదరిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పింది.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!