ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న భారత్, యూఏఈ టీమ్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టాయి. ఆసియా కప్ నేపథ్యంలో మాజీలు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ తన అభిపాయాన్ని చెప్పాడు. ఆసియా కప్ టైటిల్ ఫేవరెట్ భారత్ అని చెప్పాడు.…
Goenka Jokes on Team India Jersey Sponsor: భారత జట్టు జెర్సీ స్పాన్సర్ ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ తన ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇకపై ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియా జెర్సీ స్పాన్సర్గా మూడేళ్ల కాలానికి డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందంను బీసీసీఐతో కుదుర్చుకుంది. కానీ ఉన్నపళంగా ఈ ఒప్పందాన్ని మధ్యలోనే…
After Cheteshwar Pujara retirement Who’s Next in Team India: ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు పుజారా ఆదివారం (అగస్టు 24) స్వస్తి పలికాడు. ఇదే ఏడాదిలో ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. భారత జట్టులో తదుపరి ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటారు?.…
BCCI Terminates Dream 11 Sponsorship Deal: భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ‘డ్రీమ్ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులకు బీసీసీఐ…
2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్లో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్లో మాత్రం 103 మ్యాచ్లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Cheteshwar Pujara: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన ప్రముఖ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తాజాగా ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పుజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో పుజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. నిజానికి ఆస్ట్రేలియా పర్యటనలో…
BCCI Responds Amid Shreyas Iyer ODI Captaincy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఆసియా కప్కు ఎంపికైన భారత జట్టులో అయ్యర్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. గొప్ప ఫామ్లో ఉన్న ఆటగాడికి బీసీసీఐ సెలెక్టర్లు జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వలేదో అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అయ్యర్కు వన్డే కెప్టెన్సీ ఇస్తారనే వార్తలు…
Rohit Sharma To Play for India A against Australia A: ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం హిట్మ్యాన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్లో ఆడాల్సి ఉండగా.. సిరీస్ రద్దయింది. ఇక ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు. అయితే అంతకుముందే హిట్మ్యాన్ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముందు భారత్-ఎ…
Irfan Pathan emotional comments on Yusuf Pathan: మైదానంలో బంతితో విధ్వంసం సృష్టించి, ప్రత్యర్థులను బ్యాట్తో వణికించిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ 2006లో కరాచీలో పాకిస్థాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసి సంచలనంగా మారాడు. అద్భుతంగా స్వింగైన బంతులకు సల్మాన్ బట్, యూనస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్ను ఔట్ అవ్వడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. అప్పట్లో హ్యాట్రిక్ అంటే పెద్ద విషయం. అందులోనూ టెస్ట్ మ్యాచ్,…