World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
- సెప్టెంబరు 30 నుంచి వన్డే ప్రపంచకప్ 2025
- వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీ ఆవిష్కరణ
- ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్ప్రీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Says India Will Win the Women’s ODI World Cup 2025: వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని, ఈసారి తప్పక గెలుస్తాం అని చెప్పారు. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చాలా విషయాలు మారిపోయాయని, అభిమానులు ఎంతగానో ఉత్సాహపరిచారన్నారు. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా తనకు చాలా ప్రేరణ లభిస్తుందని హర్మన్ప్రీత్ చెప్పారు. సోమవారం వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీని ముంబైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ ప్లేయర్ యువరాజ్సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లతో పాటు హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు.
హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ… ‘భారతీయులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అడ్డంకిని మేం బద్దలు కొడతాం. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా నాకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఆస్ట్రేలియాతో ఆడటం సవాల్తో కూడుకున్నదే. మెగా టోర్నీకి ముందు ఆసీస్తో వన్డే సిరీస్ ఆడడం కలిసొస్తుంది. మేం చాలా కష్టపడుతున్నాం. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ (171) నాకు ఎంతో ప్రత్యేకం. ఆ మ్యాచ్ తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఫైనల్లో ఓడిపోయి తిరిగొచ్చినా మాకు ఘన స్వాగతం దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం’ అని చెప్పారు.
Also Read
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
Also Read: Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా రానుంది. భారత మహిళల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్ గెలవలేదు. విజయానికి దగ్గరగా వెళ్లి తుది మెట్టుపై బోల్తా పడ్డారు. 2017 ప్రపంచకప్లో భారత్ రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ గెలవాలని భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!