World Cup 2025: అన్ని మారాయి.. వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం: టీమిండియా కెప్టెన్
- సెప్టెంబరు 30 నుంచి వన్డే ప్రపంచకప్ 2025
- వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీ ఆవిష్కరణ
- ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్ప్రీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur Says India Will Win the Women’s ODI World Cup 2025: వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని, ఈసారి తప్పక గెలుస్తాం అని చెప్పారు. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చాలా విషయాలు మారిపోయాయని, అభిమానులు ఎంతగానో ఉత్సాహపరిచారన్నారు. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా తనకు చాలా ప్రేరణ లభిస్తుందని హర్మన్ప్రీత్ చెప్పారు. సోమవారం వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీని ముంబైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ ప్లేయర్ యువరాజ్సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లతో పాటు హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు.
హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ… ‘భారతీయులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అడ్డంకిని మేం బద్దలు కొడతాం. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా నాకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఆస్ట్రేలియాతో ఆడటం సవాల్తో కూడుకున్నదే. మెగా టోర్నీకి ముందు ఆసీస్తో వన్డే సిరీస్ ఆడడం కలిసొస్తుంది. మేం చాలా కష్టపడుతున్నాం. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ (171) నాకు ఎంతో ప్రత్యేకం. ఆ మ్యాచ్ తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఫైనల్లో ఓడిపోయి తిరిగొచ్చినా మాకు ఘన స్వాగతం దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం’ అని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read: Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా రానుంది. భారత మహిళల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్ గెలవలేదు. విజయానికి దగ్గరగా వెళ్లి తుది మెట్టుపై బోల్తా పడ్డారు. 2017 ప్రపంచకప్లో భారత్ రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ గెలవాలని భారత్ చూస్తోంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..