ఒకవైపు టీ20 ప్రపంచకప్ జరుగుతుండగానే.. మరోవైపు భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు సన్నద్ధమవుతోంది. నవంబర్ 17 నుంచి టీమిండియాతో మూడు టీ20లతో పాటు మూడు టెస్టులను ఆ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టెస్టులకు ప్రధాన బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు సెలక్టర్లు విశాంత్రి ఇచ్చారు. Read Also: వెల్లివిరిసిన మతసామరస్యం.. రాముడికి ముస్లిం మహిళల హారతి టీ20 జట్టు:…
భారత్లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత ఆ రేంజ్లో అభిమానులు ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. సచిన్ అంత సౌమ్యుడు కాకపోయినా, ధోనీ అంత కూల్ మనస్తత్వం లేకపోయినా.. తన అగ్రెసివ్ నేచర్తో ప్రత్యర్థులకు మాటలు తూటాలతో సమాధానం చెప్పగల క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆ దూకుడు స్వభావమే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా మార్చింది. భారత అభిమానుల నుంచి విదేశీ అభిమానుల వరకు అందరూ నచ్చిన,…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం పసికూన స్కాట్లాండ్తో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కోహ్లీ సేన సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గత మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్లోనూ భారీ విజయం సాధించాల్సి ఉంది. ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్లోనూ వారిద్దరూ చెలరేగి…
t20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తర్వాత టీ20లో ఇండియా సారథి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. దీంతో టీమిండియాకు హెడ్ కోచ్గా ఎంపికైన రాహుల్ ద్రావిడ్ పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్గా హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఉండవ చ్చని అన్నాడు. అతడికి ఉన్న అనుభవం దృష్య్టా కెప్టెన్గా రోహితే తన ఫస్ట్ ఛాయిస్ అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత విరాట్…
ప్రస్తుతం మూడు గంటల్లో ముగిసిపోయే టీ20 మ్యాచ్లు క్రికెట్ ప్రియులకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ఐపీఎల్, బిగ్బాష్ వంటి టోర్నీలు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే టీ20 క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాలకు సంబంధించిన పలు రికార్డుల గురించి మనకు తెలుసు. కానీ ధనాధన్ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరు గెలుచుకున్నారో మీకు తెలుసా? Read Also: దీపావళి అంటే చాలు.. రెచ్చిపోతున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20…
టీమిండియా కొత్త కోచ్గా.. భారత మాజీ క్రికెటర్, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్-19, భారత్-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్గా చెరగని ముద్ర వేసిన రాహుల్… ఇకపై భారత్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. అండర్-19 జట్టును ఒకసారి రన్నరప్గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్. టీ20 ప్రపంచకప్ తర్వాత.. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్ ద్రవిడ్…
ఏవైనా స్పెషల్ డేస్ వస్తే రోహిత్ శర్మకు ఊపు వస్తుందని మరోసారి రుజువైంది. దీపావళి పండగకు, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. దీపావళి అంటే చాలు రోహిత్ రెచ్చిపోతున్నాడు. దీపావళి సందర్భంగా ఆరోజు లేదా అంతకుముందు రోజు జరిగే మ్యాచ్లలో రోహిత్ విశ్వరూపం చూపిస్తున్నాడు. Read Also: టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత్ 2013లో దీపావళి సమయంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ చేశాడు. 2016లో న్యూజిలాండ్తో జరిగిన…
ప్రస్తుత భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ పాత్రలో సేవలందించేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ భారత మాజీ క్రికెటర్ 2019లో సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ కు ముందు రాథోర్ మాట్లాడుతూ.. భారత జట్టులో అనుభవం చాలా ఉంది. అలా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు…
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్ సింగ్ అంటే నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్, 2007 ప్రపంచకప్లో ఆరు సిక్సర్లు గుర్తుకురాక మానవు. ఆయా మ్యాచ్లలో యువీ అంతటి గొప్ప ముద్ర వేశాడు. అయితే మంగళవారం నాడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ తనను మైదానంలో చూస్తారని హింట్ ఇచ్చాడు. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ మళ్లీ తనను ఫీల్డ్లో చూస్తారని…
టీ20 ప్రపంచకప్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా…