టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుండగా… ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్తో ఆడిన తొలి మ్యాచ్లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ను ఓడిపోయాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. భువనేశ్వర్ స్థానంలో శార్దూల్…
ఈరోజు భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఆడితే మన జట్టుకు ప్రమాదం అని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్ పాండ్య తన భారత కెరీర్ను కాపాడుకోవడానికి ఇప్పుడు ఆడుతున్నాడు. మేము హార్దిక్ను నెట్స్లో చూశాము. అయితే అతను దాదాపు రెండు నెలలుగా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. అలంటి…
దుబాయ్ వేదికగా కాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్లో ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం టీమిండియాను భయపెడుతున్నాడు. కొన్నేళ్లుగా టీమిండియా ఆడుతున్న నాకౌట్ మ్యాచ్లలో అతడు నిలబడితే చాలు.. ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమి తథ్యం అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ అతడు ఎవరంటే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. Also Read: భారత్-కివీస్…
మరికాసేపట్లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. టీ20 ప్రపంచకప్లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈరోజు జరిగే పోరు ఇరుజట్లకు చావో రేవో లాంటిది. ఈ పోరులో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? Also Read: ధోనీ అభిమానులకు ఈరోజు మరపురాని రోజు ఈ…
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు అక్టోబర్ 31 మరపురాని రోజు అని చెప్పాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు ధోనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2005లో శ్రీలంకతో టీమిండియా ఏడు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో మూడో మ్యాచ్లో ధోని తన మాస్టర్ స్ట్రోక్ చూపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. అక్టోబర్ 31,2005 జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్…
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా..…
వచ్చే ఆదివారం టీం ఇండియా ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టుకు కొన్ని సూచనలు చేసారు లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కివీస్ పై మ్యాచ్ లో హార్దిక్ పాండ్య అలాగే భువనేశ్వర్ కుమార్ లను పాకాన పెట్టాలి అని సునీల్ తెలిపారు. వీరి స్థానాల్లో ఇషాన్ కిషన్ అలాగే శార్దూల ఠాకూర్ లను…
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు.…
టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తన అభిమానులకు గుడ్న్యూస్ అందించాడు. దినేష్ కార్తీక్, దీపిక పల్లికల్ జంటకు గురువారం నాడు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ముగ్గురం కాస్తా.. ఐదుగురం అయ్యాం. దీపిక, నేను ఇద్దరు అందమైన మగ పిల్లలతో ఆశీర్వాదం పొందాం. ఇంతకన్నా సంతోషంగా ఉండలేము’ అంటూ డీకే రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన కవల పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓడిపోవడంతో అందరూ భారత బౌలర్ షమీని నిందించారు. అతడిపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్థాన్ బ్యాటింగ్ సమయంలో విజయానికి బంతికో పరుగు అవసరం కాగా.. 18 ఓవర్ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీచేత వేయించాడు. అయితే మంచు ఎక్కువగా కురవడం, బంతి చేతికి చిక్కకపోవడంతో షమీ వరుసగా 6, 4, 4 సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్థాన్ విజయం తేలికైపోయింది. భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ మొదలైంది.…