టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్కు విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. అతడు తొలి టెస్టుకు కూడా దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు టీ20లకు కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ రహానె సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఆ టెస్టుకు…
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మటు నుండి కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలు భారత రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. వన్డే ఫార్మటు లో కూడా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు కోరుకుంటోందని తెలుస్తుంది. ఆ కారణంగా కోహ్లీన బ్యాటింగ్పై దృష్టి పెట్టి మళ్ళీ ఫామ్కి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది…
యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత విశ్రాంతి అనే పదం బాగా తెరపైకి వచ్చింది. అది లేకనే భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో సరిగా ప్రదర్శన చేయలేదు అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆటగాళ్ల ఒత్తిడిని అంచనా వేసి.. ఎవరికి ఎప్పుడు విశ్రాంతి అవసరమో బీసీసీఐనే నిర్ణయించనున్నట్లు… ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించబోతున్నట్లు సమాచారం. ఆ…
టీ-20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో భారత టీ20 జట్టు సారధిగా తన కెరీర్ ముగించిన విరాట్ కోహ్లీకి మరో చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో నాలుగు స్థానాలు కోల్పోయాడు కోహ్లీ. టీ20 ప్రపంచకప్లో లీగ్ దశ ముగిసిన తర్వాత అంతర్జాతీయ ర్యాంకుల్లో చాలా మార్పులు వచ్చాయి. వాటిలో కోహ్లీ స్థానం కూడా ఒకటి. టోర్నీ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ టీ20 బ్యాట్స్మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీ.. లీగ్ దశ ముగిసే…
భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కెప్టెన్సీ లో ఆడిన ఆఖరి టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా.. అభిమానులను నిరాశపర్చింది. ఈ మెగా టోర్నీలో కనీసం సెమీస్కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ అనంతరం కోహ్లీ న్యాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత… దాని…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత ప్రయాణంతో పాటుగా… టీ20 ఫార్మాట్ లో ఇండియా జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ప్రయాణం కూడా ముగిసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాదే మరో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఉండటంతో.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండ ఉండాలని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ ఆర్డర్కు స్థిరత్వాన్ని ఎవరు అందించలేరని నెహ్రా సూచించాడు. మీరు కోహ్లీని…
ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి…
విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐపీఎల్లో ఏ కెప్టెన్కు సాధ్యపడని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్ను అందించాడు. మరోవైపు వన్డేల్లో భారత్ కెప్టెన్గా 10 మ్యాచ్లకు సారథ్యం వహించిన రోహిత్… 8 మ్యాచ్లలో…
భారత టీ20 కెప్టెన్గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ టీ20లకు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం బాగోలేదని చెప్పడానికి నిదర్శనమన్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయని.. అందులో ఒకటి ఢిల్లీ గ్రూప్.. రెండోది ముంబై గ్రూప్ అని వ్యాఖ్యలు…
భారత ‘ఏ’ జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఈ రోజు ఇండియాలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత ‘ఏ’ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్ లు మూడు ఆడనుంది. ఇందుకోసం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ కెప్టెన్ గా వ్యవరించనుండగా……