మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
భారతదేశంలో మరలా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను కూడా రద్దు చేసి.. ఆర్ధిక లావాదేవీలను డిజిటల్లో మార్చిచే అవినీతిని రూపుమాప వచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వాట్సప్ గవర్నర్స్ తీసుకొచ్చాం అని, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు…
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పు రావాలని, మహానాడు వేదికగా మరో 40 సంవత్సరాలు పార్టీ నడపడానికి కావలసిన అంశాలపై చర్చించాలన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏపీలో నేరస్తులకు చోటు లేదని, ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామన్నారు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం అని, తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేశాం అని.. అవినీతిపై పోరాటం చేస్తే ఇప్పుడు సీబీఐ విచారణ చేసే పరిస్థితి…
ప్రాణ సమాణమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆరంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. కడపలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు తెలపడం కోసమే ఈ మహానాడు నిర్వహిస్తున్నాం అని సీఎం తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాలు గెలిచి సత్తా చాటాం అని, ఈసారి ఇంకాస్త కష్టపడితే పదికి పది…
కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలో తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రాంగణంలో మహానాడు కిట్టును సీఎం కొనుగోలు చేశారు. ఆపై ఫొటో ప్రదర్శనను తిలకించారు. మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తదాన శిబిరాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. Also Read: Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే? మహానాడు ప్రాంగణంలోని…
నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ‘తెలుగుదేశం మహా పండుగ…
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం…
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. రాజమండ్రి సిటీ సీటు విషయంలో రెండు వర్గాల మధ్యవిభేదాలు ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. 2014-19 మధ్య పీక్స్కు చేరిన గొడవలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళతో పాటు గడిచిన ఏడాదిగా కాస్త తగ్గాయి. కిందిస్థాయిలోని నాయకుల మధ్య అడపాదడపా గొడవలు జరుగుతున్నా... అవి పెద్ద నేతలిద్దరూ జోక్యం చేసుకునేదాకా వెళ్ళలేదు.
ఏపీ లిక్కర్ స్కాం ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ ఉంటోంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరవబోయే ఒకరోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేయటం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని చెప్పడానికే వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.