Abhishek Sharma: ఫిట్నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
- నమీబియాపై 8 బంతుల్లో 22 పరుగులు
- కట్ చేస్తే పాకిస్థాన్ మ్యాచ్కు సంజూ దూరం
- అందుకే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో చోటుచేసుకున్న కొన్ని టీమ్ ఎంపికల నిర్ణయాలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న సంజూ.. నమీబియాపై కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ అనంతరం అతడు జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్లో సంజూ బాగా ఆడితే.. అభిషేక్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన మేనేజ్మెంట్లో మెదిలినట్లు చర్చ సాగుతోంది.
సంజూ శాంసన్ పాకిస్థాన్ మ్యాచ్లో కూడా రాణిస్తే.. అతడిని డ్రాప్ చేయడం కష్టమవుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావించిందట. అందుకే పూర్తిగా ఫిట్ కాకపోయినా అభిషేక్ శర్మనే పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై ఆడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ రెండు మ్యాచ్ల్లో అభిషేక్ డకౌట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘డకౌట్ స్టార్’ అని ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని అభిషేక్ ఆడడం చూస్తుంటే.. కావాలనే సంజూను పక్కనపెట్టినట్లు అర్ధమవుతోంది.
Also Read
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
- Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
Also Read: Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!
ఇలాంటి పరిస్థితి గతంలో శుభ్మన్ గిల్ విషయంలో కూడా ఎదురైంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అతడిని వరుసగా ఆడించగా.. ఆశించిన ఫలితాలు రాలేదు. చివరకు అతడిని తప్పించాల్సి వచ్చింది. తర్వాతే ఇతరులకు అవకాశాలు లభించాయి. ఈ రెండు సంఘటనలు జట్టు ఎంపికలో ఫిట్నెస్ ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి. గాయాలు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న ఆటగాళ్లను బలవంతంగా ఆడించడం తాత్కాలికంగా సరైన నిర్ణయం అనిపించినా.. దీర్ఘకాలంలో అది ఆటగాడికీ జట్టుకీ నష్టమే అని చెప్పొచ్చు. సరైన సమయంలో సరైన ఆటగాడికి అవకాశం ఇవ్వడం టీమ్ బ్యాలెన్స్కు అత్యంత ముఖ్యం అని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?