ఏపీ సీఎం జగన్పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా అనే అనుమానాలున్నాయి. సీఎం జగన్ ఆ అనుమానాలు నివృత్తి చేయాలి. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండనులో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..?…
గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…
ఏపీలో పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి…
ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా…
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా…
ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన…
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒంగోలు నగర సమీపంలోని మండవారి పాలెంలో 27,28 తేదీల్లో మహానాడు జరగనుంది. సమయం తక్కువగా వుండడంతో పనులు వేగవంతం చేయాలన్నారు చంద్రబాబు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ వుంటుందన్నారు. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలని కోరారు టీడీపీ నేతలు. అయితే, స్టేడియం…
కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఏపీ ముఖ్యమంత్రి నోట ఈ మధ్య కాలంలో ఎన్నికల మాట వినిపిస్తోంది. ముందస్తు వున్నా లేకున్నా. వైసీపీ నేతలు జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుపట్టడం లేదు. ప్రజల్లో ఉండటం పైనే సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారు. 12వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ డైరెక్షన్ ఇవ్వడం వెనుక వ్యూహం…