Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వెంకాయమ్మ వీడియో నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత రాత్రి వెంకాయమ్మ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకాయమ్మను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ తదితరులు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
బాధిత మహిళ వెంకాయమ్మ మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో మీడియా అడిగిన వాటికి వాస్తవాలే మాట్లాడానన్నారు. ఇందుకు వైసీపీ నేతలు నా ఇంటికి వచ్చి నా గొంతు నొక్కి, జాకెట్ చించి దాడికి పాల్పడ్డారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న నాపై కనీస కనికరం చూపలేదు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులు వెంకాయమ్మ చెప్తే.. జీర్ణించుకోలేకే వెంకాయమ్మపై పథకం ప్రకారం దాడి చేశారు. గొంతెత్తి మాట్లాడితే బతికే స్వేచ్ఛ రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు నక్కా ఆనందబాబు.
పథకం ప్రకారమే రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు చేయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈ ఘటనపై మండిపడ్డారు. వెంకాయమ్మ పేదరికంలో ఉన్నా నీతిగా నిర్భయంగా మాట్లాడింది.బడుగులను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వదిలిపెట్టం అన్నారు. వెంకాయమ్మ విషయంలో ఏం చేస్తారో మహిళా కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు.
తాజావార్తలు
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!