Ashokgajapathi Raju: భావితరాలకు భారంగా అప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా అప్పులు పడే విదంగా వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు.
కర్ఫ్యూకి కారకులైన నాయకులు మాకు నేర్పిస్తారా…మమ్మల్ని భయపెడతారా? మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్లారు. కానీ ఏ రోజు భయపడలేదు. అన్నగారి పౌరుషంతో బ్రతికారు. అలానే మనం కూడా బ్రతకాలి. స్థానిక ఎమ్మెల్యే మూర్ఖత్వంతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తలు ఒక వారధి లాంటివారు. తెల్ల దొరలు భయపెట్టినట్టు ప్రతీ విషయంలో వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారు.
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండని హెచ్చరిస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. చేసిన పనిలో పెద్దరికం ఉంటుంది. కావున మన ధర్మం ఏంటనేది మనం ఆలోచించుకుని పని చేయాలి. జైల్లో ఉండవలిసిన వాడు బెయిలుపై వచ్చి మన భవిష్యత్ ను, మన పిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయాల్లో గమ్మత్తైన పరిస్థితులను చూస్తున్నాం.
ఎంతో మంది ప్రముఖల స్ఫూర్తితో 40 ఏళ్ల కిందట తెలుగు వాళ్ల కోసం టీడీపీని స్థాపించారు. దేశంలో రాజకీయాల్లో ప్రభావాన్ని తీసుకు వచ్చిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీఆర్. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎవరి కంటే తక్కువ కాదని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని శ్లాఘించారు. ఒట్టి మాటలు కట్టిపెట్టు..గట్టి మేలు తలపెట్టవోయ్ .అంటూ గురజాడ మాటలను గుర్తు చేస్తున్నా అన్నారు అశోక్ గజపతిరాజు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేస్తే టీడీపీ కి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!