AP Ministers Ratings: మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!
- మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్
- అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్
- నాలుగో స్థానంలో డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ministers Ratings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం మొదటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శాఖలలో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై ఆయన మంత్రులకు రేటింగ్స్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు.
మంత్రి అచ్చెన్నాయుడు తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉండడం విశేషం. మరోవైపు మంత్రి వంగలపూడి అనిత చివరి స్థానంలో ఉన్నారు. మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో వివరంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పనులు వేగంగా పూర్తయ్యేలా ఫైళ్ల క్లియరెన్స్ త్వరగా జరగాలని సూచించారు. పరిపాలనలో వేగం పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
Also Read: AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
ఇక కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆదాయార్జనకు సంబంధించిన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. దీనితో పాటు విద్యా రంగం, ఉపాధి అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. కోర్టు కేసులు, న్యాయ శాఖ పరిధిలో ఉన్న అంశాలపై కూడా అధికారులు వివరాలు సమర్పించనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈ సమీక్ష జరగనుండగా.. రాష్ట్రంలో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!