పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం స్వాగతించారు.
గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.
Driver Harassed Actress Nakshathra Sister In Bus: ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల్లో మార్పు రాకపోగా, మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు.. లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓ బస్సు డ్రైవర్ కూడా అలాంటి నీచ పనే చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అతగాడు.. బస్సులోనే ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తెలివిగా ప్రదర్శించి, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘వల్లి తిరుమనం, యారది నీ…
తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సూపర్స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Tamil Nadu Chief Minister MK Stalin, who tested positive for COVID recently, was admitted to a private hospital in Chennai for "investigation and observation for COVID19-related symptoms".
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చిన సీఎం స్టాలిన్ను పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టాలిన్ను కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రెడ్డప్ప, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్య ఉన్నారు. వీరిని డీఎంకే ఎంపీ కనిమొళి సీఎం స్టాలిన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా…
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలితో మందుకు వెళుతున్నారు ఎంకే స్టాలిన్. మొన్నటి వరకు ఆయన చేసిన పనులకు నీరాజనం పట్టిన ప్రజలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుపై ప్రభావం చూపింది. భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. అయితే ఈ నేపథ్యంలో వరదలు సంభవించాయి. దీంతో వరదలను ఎదుర్కొవడంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందంటూ ట్విట్టర్ వేదికగా గోబ్యాక్స్టాలిన్ హ్యాష్ట్యాగ్తో విమర్శలు…