Tamilnadu: గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. ఆయన మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లఘించారని డీఎంకే పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన మెమోరాండంలో పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో ఆయన అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రకటనలు ప్రయత్నిస్తున్నందున దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పేర్కొంది. ఆర్ఎన్ రవి రాజ్యాంగ పదవికి అనర్హుడని పేర్కొంది. ఆయన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. దీనిపై గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించలేదు. ఆర్ఎన్ రవిని తొలగించాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే ఈ నెల ప్రారంభంలో పలువురు ఎంపీలకు కూడా లేఖ రాసింది.
Justice Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. గవర్నర్ను రాష్ట్రపతి నియమించవచ్చు లేదా తొలగించవచ్చునని చట్టం చెబుతోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం బిల్లును పంపితే, గవర్నర్ దానిని ఒకసారి వెనక్కి పంపవచ్చు. కేబినెట్ బిల్లును గవర్నర్కు మళ్లీ పంపితే, వారు దానిని వెనక్కి పంపలేరు. ఈ గవర్నర్లు కేంద్రం చేతిలో తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, వారి చర్యల వెనుక బీజేపీ మద్దతు ఉందని, రాజకీయ ప్రతీకారాన్ని చూపిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. తమిళనాడు విషయంలోనూ తెలంగాణ గవర్నర్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికార బాధ్యతలు స్వీకరించడానికి ముందు తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఉన్నారని, ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలగజేసుకున్నారని డీఎంకే ఆరోపించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నియామకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.