Tamilnadu: గవర్నర్ను తక్షణమే బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి అధికార డీఎంకే మెమోరాండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. ఆయన మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లఘించారని డీఎంకే పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన మెమోరాండంలో పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో ఆయన అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రకటనలు ప్రయత్నిస్తున్నందున దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పేర్కొంది. ఆర్ఎన్ రవి రాజ్యాంగ పదవికి అనర్హుడని పేర్కొంది. ఆయన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. దీనిపై గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించలేదు. ఆర్ఎన్ రవిని తొలగించాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే ఈ నెల ప్రారంభంలో పలువురు ఎంపీలకు కూడా లేఖ రాసింది.
Justice Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. గవర్నర్ను రాష్ట్రపతి నియమించవచ్చు లేదా తొలగించవచ్చునని చట్టం చెబుతోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం బిల్లును పంపితే, గవర్నర్ దానిని ఒకసారి వెనక్కి పంపవచ్చు. కేబినెట్ బిల్లును గవర్నర్కు మళ్లీ పంపితే, వారు దానిని వెనక్కి పంపలేరు. ఈ గవర్నర్లు కేంద్రం చేతిలో తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, వారి చర్యల వెనుక బీజేపీ మద్దతు ఉందని, రాజకీయ ప్రతీకారాన్ని చూపిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. తమిళనాడు విషయంలోనూ తెలంగాణ గవర్నర్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికార బాధ్యతలు స్వీకరించడానికి ముందు తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఉన్నారని, ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలగజేసుకున్నారని డీఎంకే ఆరోపించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నియామకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?