Tamilnadu: గవర్నర్ను తక్షణమే బర్తరఫ్ చేయండి.. రాష్ట్రపతికి అధికార డీఎంకే మెమోరాండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. ఆయన మత విద్వేషాన్ని రెచ్చగొట్టాడని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లఘించారని డీఎంకే పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన మెమోరాండంలో పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో ఆయన అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి ఆయన ప్రకటనలు ప్రయత్నిస్తున్నందున దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పేర్కొంది. ఆర్ఎన్ రవి రాజ్యాంగ పదవికి అనర్హుడని పేర్కొంది. ఆయన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. దీనిపై గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించలేదు. ఆర్ఎన్ రవిని తొలగించాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే ఈ నెల ప్రారంభంలో పలువురు ఎంపీలకు కూడా లేఖ రాసింది.
Justice Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
తమిళనాడులో 20 బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. గవర్నర్ను రాష్ట్రపతి నియమించవచ్చు లేదా తొలగించవచ్చునని చట్టం చెబుతోంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం బిల్లును పంపితే, గవర్నర్ దానిని ఒకసారి వెనక్కి పంపవచ్చు. కేబినెట్ బిల్లును గవర్నర్కు మళ్లీ పంపితే, వారు దానిని వెనక్కి పంపలేరు. ఈ గవర్నర్లు కేంద్రం చేతిలో తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, వారి చర్యల వెనుక బీజేపీ మద్దతు ఉందని, రాజకీయ ప్రతీకారాన్ని చూపిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. తమిళనాడు విషయంలోనూ తెలంగాణ గవర్నర్ జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికార బాధ్యతలు స్వీకరించడానికి ముందు తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకురాలిగా ఉన్నారని, ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కూడా కలగజేసుకున్నారని డీఎంకే ఆరోపించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నియామకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!