Home
Suvendu Adhikari
Suvendu Adhikari News
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భాషా వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సేవల్లో, అధికారిక సమాచార వ్యవస్థల్లో ఇకపై బెంగాలీ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి తాజాగా ప్రకటించారు. ఈ కొత్త రూల్ 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల కోసం హిందీని కూడా ఉపయోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తాజాగా సీఎం వెల్లడించిన వివరాల… -
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
Bangladesh: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి నిర్ణయాలు, వ్యాఖ్యలు బంగ్లాదేశ్కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఇన్నాళ్లు అత్తగారి ఇంటిలా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కు వలసలు సాగేవి. బీజేపీ ప్రభుత్వ రాకతో అక్రమ చొరబాటుదారులు సొంత దేశానికి పారిపోతున్నారు. ఇదే కాకుండా, బంగ్లాదేశీయుల్ని హెచ్చరిస్తూ సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిపై బంగ్లాదేశ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై బంగ్లా పార్లమెంట్లో కీలక చర్చ జరిగింది. అధికార బీఎన్పీ ఎంపీ… -
Mahua Moitra: ఆ రాత్రంతా ఏడ్చాను.. సువేందు అండగా ఉన్నారు.. మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలతో సతమతం అవుతున్న మమతా బెనర్జీ.. ఇప్పుడు సన్నిహితురాలు మహువా మొయిత్రా వ్యాఖ్యలు చూస్తుంటే ఈమె కూడా ప్లేట్ ఫిరాయించే సూచనలు కనిపిస్తున్నాయి. -
Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
Suvendu Adhikari: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని నూతన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చారిత్రాత్మక పారామిలట్రీ దళం ‘ఈస్టర్న్ ఫ్రంటియర్ రైఫిల్స్’ (EFR) పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. డార్జీలింగ్ కొండ ప్రాంత పర్యటనలో భాగంగా కుర్సియాంగ్లో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. EFR లోకి 1,000 మందికి పైగా గూర్ఖా యువకులను రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 30 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించనున్నట్లు… -
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు నిలువునా కూలిపోతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని, ఎమ్మెల్యేలు, చివరకు పార్లమెంట్ సభ్యుల (MPs) వరకు అందరూ ఆమెపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ ఏడాది మే 4న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, టీఎంసీని ప్రతిపక్షంలోకి నెట్టేసినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.… -
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
Trinamool Congress: బెంగాల్తో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఓ వైపు ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు బీజేపీతో సమావేశమయ్యారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి, బీజేపీ నేతలు భూపేంద్ర యాదవ్లతో వీరంతా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసి, మమతను కాదని రీటబ్రత బెనర్జీ వైపు వెళ్లారు. 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఆయనకు మద్దతు… -
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్టా ప్రాంతంలో టీఎంసీ బలమైన నేతగా పేరొందిన జహంగీర్ ఖాన్ను వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. భారత్- నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్నాడు. ఫాల్టాలో… -
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొన్న సమయంలోనే, తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. 14 మంది టీఎంసీ బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంటిలో సమావేశమయ్యారు. 14 మంది లోక్సభ ఎంపీలు ఈ బీజేపీతో టచ్లోకి వెళ్లడం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే, టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఇప్పటికే రీటబ్రత బెనర్జీ క్యాంపులో… -
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని ఆమె అన్నారు. బెంగాలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల్లోనే హామీలను అమలు చేయడం ప్రశంసనీయం అని, హామీల అమలు వేగాన్ని చూస్తే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న వారు గౌరవానికి… -
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్దేబ్ చటోపాధ్యాయను నియమించడంపై వివాదం మొదలైంది. ఇప్పుడు టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది వరకు మమతపై తిరుగుబాటు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రీటబ్రత బెనర్జీ వెనక తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమత పక్షాన…
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!