Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- తృణమూల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్..
- ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ..
- బీజేపీ నేతలతో భేటీ అయిన 14 మంది టీఎంసీ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొన్న సమయంలోనే, తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. 14 మంది టీఎంసీ బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంటిలో సమావేశమయ్యారు. 14 మంది లోక్సభ ఎంపీలు ఈ బీజేపీతో టచ్లోకి వెళ్లడం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే, టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఇప్పటికే రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. మమతా బెనర్జీని ధిక్కరించి వ్యవహరిస్తున్నారు.
సోమవారం ఢిల్లీకి సువేందు అధికారి వచ్చారు. మరోవైపు, ఢిల్లీలోనే ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నాయి. 14 మంది ఎంపీలతో జరుగుతున్న సమావేశంలో సువేందుతో పాటు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేబ్ కూడా ఉన్నారు.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
దీనికి ముందు, సోమవారం ఉదయం ఐదుగురు తృణమూల్ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బెంగాల్ సీఎం సువేందు కూడా ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ, చీఫ్ విప్గా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ తన ఎంపీ పదవితో పాటు, టీఎంసీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీనియర్ టీఎంసీ నేత రాజీనామా చేయడం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. టీఎంసీకి చెందిన 29 లోక్సభ ఎంపీల్లో 14 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీఎంసీకి రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ను ఢిల్లీలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కలిశారు. ఈ సమావేశంలో బుర్ద్వాన్ ఈస్ట్ ఎంపీ షర్మిలా సర్కార్, హౌరా ఎంపీ ప్రసూన్ బెనర్జీ, కూచ్ బెహార్ ఎంపీ జగదీష్ బసునియా, ఝార్గ్రామ్ ఎంపీ కాళిపద్ సోరెన్, బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!