Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- తృణమూల్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్..
- ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ..
- బీజేపీ నేతలతో భేటీ అయిన 14 మంది టీఎంసీ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొన్న సమయంలోనే, తృణమూల్ ఎంపీలు తిరుగుబాటు చేసి, బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయినట్లు తెలుస్తోంది. 14 మంది టీఎంసీ బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంటిలో సమావేశమయ్యారు. 14 మంది లోక్సభ ఎంపీలు ఈ బీజేపీతో టచ్లోకి వెళ్లడం మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే, టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఇప్పటికే రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. మమతా బెనర్జీని ధిక్కరించి వ్యవహరిస్తున్నారు.
సోమవారం ఢిల్లీకి సువేందు అధికారి వచ్చారు. మరోవైపు, ఢిల్లీలోనే ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని పెంచుతున్నాయి. 14 మంది ఎంపీలతో జరుగుతున్న సమావేశంలో సువేందుతో పాటు భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేబ్ కూడా ఉన్నారు.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీనికి ముందు, సోమవారం ఉదయం ఐదుగురు తృణమూల్ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత బెంగాల్ సీఎం సువేందు కూడా ఆయన నివాసానికి వెళ్లారు. మరోవైపు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ, చీఫ్ విప్గా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ తన ఎంపీ పదవితో పాటు, టీఎంసీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీనియర్ టీఎంసీ నేత రాజీనామా చేయడం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. టీఎంసీకి చెందిన 29 లోక్సభ ఎంపీల్లో 14 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, టీఎంసీకి రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ను ఢిల్లీలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కలిశారు. ఈ సమావేశంలో బుర్ద్వాన్ ఈస్ట్ ఎంపీ షర్మిలా సర్కార్, హౌరా ఎంపీ ప్రసూన్ బెనర్జీ, కూచ్ బెహార్ ఎంపీ జగదీష్ బసునియా, ఝార్గ్రామ్ ఎంపీ కాళిపద్ సోరెన్, బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?