Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం బుద్ధదేవ్ భార్య ప్రశంసలు..
- సువేందు అధికారి పాలనపై లెఫ్ట్ కితాబు..
- బెంగాల్లో చర్చనీయాంశంగా మారిన మీరా భట్టాచార్జీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని ఆమె అన్నారు. బెంగాలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల్లోనే హామీలను అమలు చేయడం ప్రశంసనీయం అని, హామీల అమలు వేగాన్ని చూస్తే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న వారు గౌరవానికి అర్హులు అని ఆమె మాట్లాడారు.
సీఎం సువేందు అధికారి గురించి మాట్లాడుతూ.. ఆయనను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, కానీ బెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశాభావం ఉందని చెప్పారు. పాలన విషయంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వానికి పోలిక లేదని చెప్పారు. లెఫ్ట్ 34 ఏళ్ల పాలన, టీఎంసీ 15 ఏల్ల పాలనకు మధ్య పోలికను తోసిపుచ్చారు. నందన్, విద్యాసాగర్ సేతు, సాహిత్య అకాడమీ, శిశు కిషోర్ అకాడమీ వంటి అనేక కీలక సంస్థలు, మౌలిక సదుపాయాలను స్థాపించిన ఘటన లెఫ్ట్ ప్రభుత్వానిది అని, వ్యవసాయంలో బెంగాల్ను దేశంలో అగ్రగామిగా చేసిందని అన్నారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
సింగూర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. టాటా మోటార్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ను వ్యతిరేకించినందుకు చాలా మంది స్థానికులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక వేళ ఈ ఫ్యాక్టరీ స్థాపించబడి ఉంటే బెంగాల్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయేదని చెప్పారు. తన భర్త బుద్ధదేవ్ భట్టాచార్య విజన్ ఈ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పించడం ఆయన లక్ష్యమని చెప్పారు.
గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అన్ని రంగాలు క్షీణించాయని ఆమె ఆరోపించారు. లెఫ్ట్ ఫ్రంట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. మీనాక్షి ముఖర్జీ, దీప్సితా ధర్ వంటి యువ నాయకులు పార్టీని పునర్నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూడాలన్నదే తన భర్త కల అని మీరా భట్టాచార్జీ అన్నారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బెంగాల్ పూర్వ వైభవాన్ని, కీర్తిని పునరుద్ధరిస్తే దానిని తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!