Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం బుద్ధదేవ్ భార్య ప్రశంసలు..
- సువేందు అధికారి పాలనపై లెఫ్ట్ కితాబు..
- బెంగాల్లో చర్చనీయాంశంగా మారిన మీరా భట్టాచార్జీ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం హామీలను వేగంగా అమలు చేస్తోందని ఆమె అన్నారు. బెంగాలీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల్లోనే హామీలను అమలు చేయడం ప్రశంసనీయం అని, హామీల అమలు వేగాన్ని చూస్తే సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న వారు గౌరవానికి అర్హులు అని ఆమె మాట్లాడారు.
సీఎం సువేందు అధికారి గురించి మాట్లాడుతూ.. ఆయనను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, కానీ బెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశాభావం ఉందని చెప్పారు. పాలన విషయంలో టీఎంసీ, లెఫ్ట్ ప్రభుత్వానికి పోలిక లేదని చెప్పారు. లెఫ్ట్ 34 ఏళ్ల పాలన, టీఎంసీ 15 ఏల్ల పాలనకు మధ్య పోలికను తోసిపుచ్చారు. నందన్, విద్యాసాగర్ సేతు, సాహిత్య అకాడమీ, శిశు కిషోర్ అకాడమీ వంటి అనేక కీలక సంస్థలు, మౌలిక సదుపాయాలను స్థాపించిన ఘటన లెఫ్ట్ ప్రభుత్వానిది అని, వ్యవసాయంలో బెంగాల్ను దేశంలో అగ్రగామిగా చేసిందని అన్నారు.
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
సింగూర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. టాటా మోటార్స్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ను వ్యతిరేకించినందుకు చాలా మంది స్థానికులు ఇప్పుడు బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఒక వేళ ఈ ఫ్యాక్టరీ స్థాపించబడి ఉంటే బెంగాల్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోయేదని చెప్పారు. తన భర్త బుద్ధదేవ్ భట్టాచార్య విజన్ ఈ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పించడం ఆయన లక్ష్యమని చెప్పారు.
గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అన్ని రంగాలు క్షీణించాయని ఆమె ఆరోపించారు. లెఫ్ట్ ఫ్రంట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. మీనాక్షి ముఖర్జీ, దీప్సితా ధర్ వంటి యువ నాయకులు పార్టీని పునర్నిర్మించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూడాలన్నదే తన భర్త కల అని మీరా భట్టాచార్జీ అన్నారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బెంగాల్ పూర్వ వైభవాన్ని, కీర్తిని పునరుద్ధరిస్తే దానిని తప్పకుండా స్వాగతిస్తానని చెప్పారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!