స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. ఇక, నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్పై విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ విచారణ చేయనుంది.
ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది.
సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వినడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం అడిగింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరుగలేదు అని తెలిపారు. మరో బెంచ్కు కేసును బదిలీచేస్తామని సీజేఐ ధర్మాసనం తెలుపుతూ.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవహారంలో కేంద్రంపై సుప్రీంకోర్టు మళ్లీ కఠినత్వాన్ని ప్రదర్శించింది. ప్రతి పది రోజులకోసారి ఈ అంశాన్ని పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు (జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టు) తెలిపింది.
కర్ణాటక జల సంరక్షణ సమితి, ఇతర రైతు సంఘాలు మంగళవారం బెంగళూరు బంద్కు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక విడుదల చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బెంగళూరులో బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవలే జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ టీచర్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదువు నేర్పించాల్సిన ఓ టీచర్ ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఈ ఘటనపై దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్…
Krishna Janmabhoomi: ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వివాదంపై దాదాపు 10 దావాలు దాఖలైనట్లు అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను