Supreme Court: రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్ ప్రభుత్వానికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుల గణన వివరాలను ప్రచురించకుండా బీహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని, రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.బీహార్లో కులాల సర్వేకు అనుమతినిస్తూ ఆగస్టు 1న పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలను అడ్డుకోలేమని కోర్టు పేర్కొంది. అయితే సర్వే సమయంలో తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం పబ్లిక్ చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం జనవరిలో విచారణకు రానుంది.
Also Read: Supreme Court: ఓటర్లకు ఉచితాలు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
Also Read
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నితీష్ ప్రభుత్వం కులాల సర్వే నివేదికను బహిరంగపరిచింది. మరోవైపు కుల సర్వేపై పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ తేదీని అక్టోబర్ 6వ తేదీకి నిర్ణయించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల గణనలో వ్యక్తుల వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని చెప్పబడింది. అలాగే జనవరిలోగా నోటీసుపై స్పందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఏమిటి?
బీహార్లో కుల గణన నివేదిక ప్రకారం, అత్యంత వెనుకబడిన తరగతి (EBC) జనాభా 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతి (OBC) 27 శాతం. షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం. రాష్ట్రంలోని మొత్తం 13 కోట్లకు పైగా జనాభాలో అగ్రవర్ణాల వారు 15.52 శాతం ఉన్నారు. సర్వే ప్రక్రియ లేదా సర్వే ఫలితాల ప్రచురణపై స్టే విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పదేపదే నిరాకరించింది. అయితే, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని కోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!