Supreme Court: రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేం.. బీహార్ ప్రభుత్వానికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణనకు సంబంధించిన నివేదికను బహిరంగపరిచింది. ఇందులో రాష్ట్రంలోని కులాల పరిస్థితి గురించిన సమాచారం అందించారు. కాగా, శుక్రవారం సుప్రీంకోర్టులో కుల గణనపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కుల గణన వివరాలను ప్రచురించకుండా బీహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని, రాష్ట్ర విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది.బీహార్లో కులాల సర్వేకు అనుమతినిస్తూ ఆగస్టు 1న పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలను అడ్డుకోలేమని కోర్టు పేర్కొంది. అయితే సర్వే సమయంలో తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం పబ్లిక్ చేయకూడదని న్యాయస్థానం పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం జనవరిలో విచారణకు రానుంది.
Also Read: Supreme Court: ఓటర్లకు ఉచితాలు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
Also Read
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
- Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ "పన్నీర్ టిక్కా"ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నితీష్ ప్రభుత్వం కులాల సర్వే నివేదికను బహిరంగపరిచింది. మరోవైపు కుల సర్వేపై పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ తేదీని అక్టోబర్ 6వ తేదీకి నిర్ణయించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల గణనలో వ్యక్తుల వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని చెప్పబడింది. అలాగే జనవరిలోగా నోటీసుపై స్పందించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
కుల ఆధారిత జనాభా గణన నివేదిక ఏమిటి?
బీహార్లో కుల గణన నివేదిక ప్రకారం, అత్యంత వెనుకబడిన తరగతి (EBC) జనాభా 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతి (OBC) 27 శాతం. షెడ్యూల్డ్ కులాలు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం. రాష్ట్రంలోని మొత్తం 13 కోట్లకు పైగా జనాభాలో అగ్రవర్ణాల వారు 15.52 శాతం ఉన్నారు. సర్వే ప్రక్రియ లేదా సర్వే ఫలితాల ప్రచురణపై స్టే విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు పదేపదే నిరాకరించింది. అయితే, ఇప్పుడు ఎవరి వ్యక్తిగత డేటాను పబ్లిక్ చేయకూడదని కోర్టు చెప్పింది.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!